Thursday, August 24, 2023

శ్రావణమాసం వాయనంలోకి పసుపు కుంకుమ సులువుగా అందంగా పేక్ చేసుకోవచ్చు(DIY H...

* అన్న నివేదనల పేర్లు*

 * అన్న నివేదనల పేర్లు*

1)కుశలాన్నం =పులగం
2)చిత్రాన్నం=పులిహోర
3)క్షీరాన్నం=పరమాన్నం
4)పాయసం=పాయసం 
5)శర్కరాన్నం= చక్కెరపొంగలి
6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి
7)దధ్యోదనం= పెరుగు అన్నము
8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9)శాకమిశ్రితాన్నం=కిచిడీ
10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)
12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి
14)మధురపానీయ=పానకం
15)పృథక్=అటుకులు
16)పృథకాపాయస=అటుకుల పాయసం
17)లాజ=పేలాలు
18)భక్ష్యం= పిండివంటలు
19)భోజ్యం= అన్నము మొదలగునవి
20)వ్యంజనం=పచ్చడి
21)అపూపం=అరిసెలు లేదా అప్పములు
22)మాషచక్రం= గారెలు
23)లడ్డుక,= లాడూలు
24)మోదకం= ఉండ్రాళ్ళు

సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక.

సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక. కొన్ని చోట్ల నక్షత్రపు గుఱుతులిడి సంస్కృతపదములిందుఁ బొందుగఁ బొందింపఁబడె. ఈ పదజాతమాంధ్ర పదపారిజాతమన జాతముగఁ గననగును. ( ఓగిరాల రంగనాథకవి, కాకినాడ దగ్గరలోని నీలపురి వాస్తవ్యుడు)

బహుమానము =  మన్నన, మన్నిక, మన్నింపు,
తిరస్కారము = ఆలసు, ఎల్లిదము, చౌక,
క్షాంతి = ఓరుపు, సైరణ, సైవుడు, తాలిమి, శాల్మి, తాళిక,
ఈర్ష్య = ఓర్వమి, ఈర సము, ఈస, ఈసు, గూళు,
వైరము = వేరము, పగటు, ఒంటమి, పగ, ఓమ్మమి, కంటు,
ప్రతి వైరి= సూడు (పగవాడు)
• తీక్షకోపము - రవరవ 
• ప్రణయకోపము = పొలయలుక
మాత్సర్యము - కరకరి, చలము, మచ్చరము, 
• శోకము - ఆలము, ఆకురు, కస్తి
కోపము - కనలు, బైడాలము, కనుపు, కినుక, కినుకము, ఆలుక, చిందు,కాంతాళము, రో సము, చిందర, కనరు, కసరు,
కోపమౌనము=మోడి 
• సుస్వభావము = ఈలువు 
• భక్తి = బత్తి
ఉన్మాదము = వేళాకోళము, త్రిక్క రిమ్మ, రిబ్బ, వెఱ్ఱి, పిచ్చి, ఉమ్మాదము,
ప్రేమ =నెయ్యము, నెయ్యమి, నెమ్మి, నేస్తము, నెనరు, ఎలమి, మేలు, కూరిమి, చెలిమి, అరితి, మచ్చిక, చాళి, ప్రేముడి, మక్కువ,
ఎడతెగని ప్రేమ =మరులు 
• యువయవతులచే భరింపఁబడిన ప్రేమ = వలపు
వాత్సల్యము = ఆర్మిలి, ఆయర్లు, 
* విస్మృతి = మఱుపు, మఱుకువ,
కాంక్ష = ఇచ్చ, కాయువు, కోర్కె, ఏఁకట, కోరిక, ఆస,
ఆర్థాశ = ఆడియాస 
• స్మృతి = తలంపు 
• స్మృతివి శేషము=పోవె
మనోవ్యధ = ఆంగలార్పు, అంగద, నెంజిలి, మనికితము, తుందుడుకు,
ఉత్కంఠ = అగ్గలిక 
• ఉత్సాహము= హాళి, జతనము, 
• అధిక క్రీడ = చెరలాట
కపటము = గబ్బ, గౌరు, గబుసు, కైపు, కిటుకు, కౌడు, డబ్బు, కబడు, డంబు,
అపదేశము - నెపము, నెవము, 
• నిష్క పటుఁడు=నిక్కవుఁడు
స్వప్నము = కల 
• విలాసము= లలి (ఇది యవ్యయము) 
• హిక్క = వెక్కు, వెనటు,
ప్రమాదము - ఏమరి పాటు, ఏమరిక, మోసము, పరాకు,
అవధానము = ఎచ్చరిక, ఎచ్చరింపు, ఏవ, పదిలము, హవణిక, పోణిమి,
కుతూహలము = వేడ్క, వేడుక,
విలాసము = బిత్తరము, కులుకు వెళము, వేళకు, గునుపు, గోనవు, మురిపెము, మురువు, సొగసు, నిక్కు, మిటారింపు, నీటు, మిటారము, తెక్కు, తెక్కరము, ఎమ్మె, టెక్కు, టీకు, 'హెరంగు, హెరుగు, చి స్నె, పొలుపు, పొలపము, ఒయ్యారము;  ఒయారము, బులుపు, హెూయలు,
పరిహాసము = శ్రేణి, తచ్చన, కేరడము, గేలి, 'మేలము, మందె మేలము, ఆట, త్ర స్తరి, హాళి,
క్రీడ = త్రుళ్లాట, గొండ్లి, 
• సహక్రీడ = సయ్యాటము, సయ్యాట,
సంభ్రమము = ఉత్తలము, తమకము, తహతహ, తమి, తత్తరము, చిడిముడి, తరితీపు, తరము, చిడిముడిపాటు,
రోమాంఛము = పులకలు, పులకరము, గద్గురు, గగురు, గరుదాల్పు,
రోదనము = ఏడుపు, ఏడ్పు, గోడు, 
•జృంభణము = ఆవలింత, ఆవలింత,
నిద్రావి శేషము - నిదుర తూఁగు, తందర, 
• నిశ్చయ స్వప్న ము=నిక్కల
నిద్రాసమయమున నుత్పన్నమగుధ్వని = గురక, గురు పెట్టు,
స్వప్న ప్రలపనము = కలవరింపు కలవరింత, కలవలము, కళవళము, 
అవబోధము = 'మేలుకొనుట, మేల్కొనుట, మేలుకొంట, "మేలు కొంచుట, మెలకువ, (ఉపవడము)
భ్రుకుటి = బొమముడి 
*స్వభావము=సాజము 
• అధికకంపము=వడవడఁకు
కంపము = వలి, వలిపిడి, వడఁకు
*పర్వము - పబ్బము, పండుగ, పండువ,
క్షుద్రదేవతోత్సవవి శేషము = లేవ, తంతు, సాకు, సయంపు, జాతర, కొలుపు,
పొతాళలోకము = పాఁపజగము, నేలయడుగు, 
• దేవతా వేశము= సివము
బిలము = విలము, సురంగము, సురంగ,
కందరము = తూము, తూఁటు, తూ పరము, దొండ, చిల్లి, తొల్లి, కన్నము, కనుము, (గ్రంత)
సంపూర్ణము.

ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో !

 ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో ! సృష్ఠి అంతం చెందినా మత్స్యములు జీవించి ఉంటాయి ! తిరిగి సృష్ఠి ఉద్భావించాలంటే మత్స్యముల మూలంగానే జరుగుతుంది !


వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.

ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓరాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడాని కి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆచేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించుశ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి? " అని రాజుప్రశ్నించాడు.

అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పు డు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడ ు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకునౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్న ాయి.

సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకుతీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడ ు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.

ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--

ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్

ఆ శ్రీమన్నారాయణున ి సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--

చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్ శయ్యాపహా!

మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్న ది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైకదేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు . సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలన ి ‘మత్స్యావతారం’ ప్రబోధించినట్లు గా భావించాలి

త్రివిక్రమావతారం రూపకం ఆడియో. స్వరవీణాపాణి స్వరకల్పన...Trivikrama Avirbhavam audio Launching program photos along with audio

తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. T. V. L. గాయత్రి.

 ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. 

 1.   కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 
9.గణగణ. 10.గునగున 
11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత
22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 
27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర.  37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..
 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 
50.భుగభుగ. 
51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. 

తెలుగు పదములు. 
T. V. L. గాయత్రి.

వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకారం(Last min Saree Draping For varalakshmi ...

Wednesday, August 23, 2023

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

 శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం @ ISKCON 


1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని. 
8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. మరణం: క్రీ పూ 18.02.3102
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11  కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : ఛణురా - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం. 
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తం లో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 
27  14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. అతని జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఏపుడు వర్థమానములోనే బ్రతికారు. 
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

ఇవి మనకి తెలుసా?

  ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *నవ గ్రహలకి సంబంధించిన సమిధలు:
 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 
 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు

 మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*

*కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్*
*లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్*
*తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్*
*పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)*
💕 *మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్*
💕 *నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్*
💕 *జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్*
💕 *శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,*
💕 *దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా*
💕 *పరశురామక్షేత్రం* *(పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -* *కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం*
💕 *మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా*
💕 *నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్*
💕 *నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు*
*బోధించిన ప్రాంతం) -* *సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్*
💕 *రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్*
💕 *సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర*
💕 *హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర*
💕 *కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్*
💕 *మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్*
💕 *ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్*
💕 *గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా*
💕 *కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)*
💕 *పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్*
💕 *కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్*
💕 *శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.*
💕 *హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర*
💕 *కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర*
💕 *చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్*
💕 *కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్*
💕 *ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర*
💕 *కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్*
💕 *పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) -* *ఎటాహ్,సహజహంపూర్*
*,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -*
*కంపిల్, ఉత్తర్*
💕 *జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ* *ఆఖరా / రణ్ భూమి,బీహార్*
💕 *కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన*
*ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా*
💕 *మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్*
💕 *విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్*
💕 *శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం*
💕 *ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం*
💕 *నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –*ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్*
💕 *జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్*
💕 *బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్*
💕 *బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.*

Tuesday, August 22, 2023

శ్రావణమాస వరమహాలక్ష్మి అమ్మవారిని గ్రాండ్ గా అలంకరించుకుందాం Varalakshm...

Tuesday, August 8, 2023

దబ్బకాయ నిలవపచ్చడిఅస్సలు మిస్ అవ్వకండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వుంటుంది ...

రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!....... రచన... చింతా రామకృష్ణారావు.

 

జైశ్రీరామ్.
అశ్వధాటివృత్తము.  
రామా! రమారమణ! రామా! రమా వినుత ! రామా! రమా కలిత! రా!
రామా!రమాహృదయ!రామా!రమాస్పదుఁడ!రామా!రమాప్రియుఁడ!రా!
రామా జగద్విజయ! రా! మా మొరల్ వినగ,  రామా! నినున్ గొలుతు రా
రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!
జైహింద్.

Monday, August 7, 2023

అబ్బబ్బా... ఆడా.. మగా గొంతుకులతో ఎంతబాగాపాడాడీ అబ్బాయి?

 


అధిగమించకు నీ ధర్మాన్ని. ఆచరించు నీ ధర్మం. ధర్మో రక్షతి రక్షితః

 #ధర్మం” అంటే ఏమిటి?


ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం…

వివాహ ధర్మం!* 


తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం…

భార్య ధర్మం!* 


నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం…

మిత్ర ధర్మం!* 


సోమరితనం లేకుండటం…

పురుష ధర్మం!* 


విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం…

గురుధర్మం!* 


*భయభక్తులతో విద్యను నేర్చుకోవటం… *

శిష్యధర్మం!* 


న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం…

యజమాని ధర్మం!* 


భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం….                                       

ఇల్లాలి ధర్మం!* 


సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం…

సైనిక ధర్మం!* 


వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం…

బిడ్డల ధర్మం!* 


తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం ….              

తండ్రి ధర్మం!* 


తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరుప్రతిష్ఠలు తేవటం….                                           

బిడ్డలందరి ధర్మం!* 


తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం…

 ప్రతివాని ధర్మం!* 


తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం…

సంసార ధర్మం*


అసహాయులను కాపాడటం…

మానవతా ధర్మం!*


చెప్పిన మాటను నిలుపుకోవటం…

సత్య  ధర్మం* 


వార్ధక్యం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్‌.... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

ఏది ముసలితనం? ఎవరు వృద్ధులు? 🥰  

శ్లో.  వార్ధక్యం వయసా నాస్తి - మనసా నైవ తద్భవేత్‌ 

సంతతోద్యమ శీలస్య - నాస్తి వార్ధక్య పీడనమ్‌. 

తే.గీ.  వయసుతో రాదు వృద్ధాప్య బాధ, కనఁగ,

మనసుతోడను రాదది, మనము సతము

నిరుపమోద్యమ మార్గాన నెగడుచున్న,

నిత్యసంతోషి యువకుఁడే నిత్యమిలను.

భావము.  ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం. 

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.  70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు. నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం,సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం,మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు

జైహింద్.

Thursday, August 3, 2023

మన తెలుఁగు ఎంత గొప్పదో కదా? ... ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసము యథా తథంగా ... శ్రీ రాధికారామ్ ఆర్య.

 ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....

నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

    తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.

ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

జైహింద్.

నవ నవోన్మేష సాహిత్యోత్సవం//- మా.మారుతీశర్మ. 04 . 8 . 2023.

జైశ్రీరామ్. 

 04 . 8 . 2023. ఆంధ్రపత్రిక సంపాదకీయం-

నవ నవోన్మేష సాహిత్యోత్సవం//-

"ప్రతిభా నవ నవోన్మేషశాలిని" అన్నది లాక్షణికులు అభివ్యక్తీకరించిన వ్యాఖ్య.

దానికి చిరంజీవత్వం వుంటుందని చెప్పడానికి తదనంతర కవుల సృష్టి,అభివ్యక్తి 

అద్దం పట్టాయి.

సహజ ప్రతిభకు తోడుగా వ్యుత్పత్తి,

అభ్యాసం కూడా జత కలిస్తే,

ఆ సృష్టి,ఆ వృష్టి మరింత పుష్టితో విలసిల్లుతాయని మన మహాకవులం

నిరూపించారు.

లక్ష్యాన్ని చేరుకోవాలనే సులక్షణం కూడా అంతే అవసరం.

ఈ లాక్షణిక ప్రస్తావన ఎందుకు చేయాల్సివచ్చిం

నవనవోన్మేషాశాలియైన

ప్రతిభా సరస్వతికి ప్రతిరూపమైన అనేక సాహిత్య స్వరూపాలకు,

విభిన్న కళాప్రతిరూపాలకు నీరాజనం పట్టే 'సాహిత్యోత్సవం' 

మనందరి మధ్య జరుగుతోంది.

 మధ్యప్రదేశ్ లోని భోపాల్ఈ  సంబరాలకు వేదికగా నిలుస్తోంది.

'ఉన్మేష' పేరుతో కేంద్ర సాహిత్య అకాడెమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా

నిర్వహిస్తున్న ఈ వేడుకలు జగదానందకరంగా సాగుతున్నాయి

ఈ నెల 3 వ తేదీ నుంచి 6వ తేదీవరకు జరుగుతున్న

ఈ ఉత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి సాహిత్యమూర్తులు,

సారస్వతదీప్తులుతరలి వస్తున్నారు.

పోయిన సంవత్సరం జూన్ నెలలో 16 వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ 

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వేదికగా జరిగిన ఈ సంరంభం

అప్పుడు అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. 

అదే మొట్టమొదటి మహోత్సవం.

దానికి 'ఉన్మేష' అని అద్భుతమైన నామకరణం చేశారు.

ద్వితీయ విఘ్నం లేకుండా

ఈ సంవత్సరం అద్వితీయంగా తీర్చిదిద్దారు.పోయిన ఏడాది 

పండుగ వేళ ప్రాతినిధ్యం వహించిన అంశాలకు ఈసారి కూడా 

ప్రాముఖ్యతనిస్తూనే,

మరిన్ని సరికొత్త అంశాలను జతచేర్చారు.

'ఫెస్టివల్ అఫ్ ఎక్స్ప్రెషన్' అని అప్పుడు అన్నారు.ఇప్పుడూ

అదే అంటున్నారు.అభివ్యక్తికి అగ్రతాంబూలం ఇస్తున్నారు.

తమ భావాలను అభివ్యక్తీకరించే అవకాశం,స్వేచ్ఛ ఏ కొందరికో కాక,

ఎందరికో ఇస్తున్నారు.అందులో అందరూ వున్నారు.

అందరంటే ప్రపంచమే హద్దు.

"విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను" అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా 

విశ్వసాహిత్యానికి ఉన్మేష ఉత్సవంలో పందిర్లు కట్టి కల్యాణం కావిస్తున్నారు.

'ఉన్మేష' అని పేరుపెట్టడంలోనే నిర్వాహకుల ప్రజ్ఞ,ఉత్సాహం 

దర్శనమవుతున్నాయి.

ఇది సాహిత్య సరస్వతికి జరుగుతున్న వైభోగమైనా!

వేడుకల వేదికలకు సంగీత సరస్వతీ ప్రతిరూపాలైన రాగాలు పేర్లు పెట్టారు.

అది విలక్షణం,సులక్షణం. అంజని,గౌరంజని, జయజయావంతి,శివరంజని, 

నీలంబారి,మాల్ కౌన్స్ రాగాధిదేవతల పేర్లు పెట్టడం రసరంజితం.

ఇందులో హిందూస్థానీ- కర్ణాటక సంగీత సరస్వతుల ప్రాతినిధ్యం ధ్వనింపజేస్తూ

జాతి సమగ్రతకు జోహారులర్పించడం సముచితం,సమున్నతం.

ఈ వేదికలలో సుమారు 60అంశాలకు ప్రాముఖ్యత కల్పించారు.

యువత,గిరిజన శ్రేణుల నుంచి తలపండిన జ్ఞానవృద్ధుల వరకూ సమన్యాయం 

చేస్తూ శీర్షికలను రూపొందించారు. చర్చలకు తావు కల్పించారు.

స్వీయ కవితా పఠనాలకు,

చిన్నకథల చదివింపులకు, ఇతిహాసపు విశేషాల అభివ్యక్తికి

సమసుందరమైన వేదికలను నిర్మించారు.ఒకటేమిటి? అనువాదం,

అనుసృజన నుంచి

కొత్తగొంతుకల వరకూ చోటివ్వని మాట కనిపించలేదు.

దేశంలో ఎన్ని భాషలు ప్రముఖంగా వినవస్తున్నాయో,కనిపిస్తున్నాయో

అన్నింటినీ ఈ ఉత్సవంలో భాగస్వామ్యం చేశారు.

మన దేశ భాషా సరస్వతికే కాక, ఐర్లాండ్,టిబెట్,మారిషస్, మాల్దీవ్స్,నైజీరియా,

నేపాల్, శ్రీలంక,ఫిజీ,జపాన్,పోలాండ్, స్పెయిన్ దేశ భాషలకు కూడా

ఆరతి పడుతున్నారు. బోడో,సంతాలి,గోండ్,మిజో,బషేలీ, మాల్వి,నిమాది,

డోగ్రీ,కశ్మీరీ,గారో, మణిపురీ వంటి ఎన్నో భాషలు ఇక్కడ వినవచ్చి 

వీనుల విందుచేయనున్నాయి. ఈ ఉత్సవం కోసం ఎంపిక చేసుకున్న 

అంశాలను పరికించి చూస్తే,కొన్ని వేల పరిశోధనా పత్రాలను సృష్టించవచ్చని 

అనిపిస్తోంది.భిన్న భాషలు,కళలు,

సంస్కృతులకు నెలవై,భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభవిస్తూ

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారతీయతకు ప్రతిబింబంగా

ఈ సంబరం సందడి చేస్తోంది.

నోరులేనివారికి,అణగారినవారికి,

అబలలకు,అల్పసంఖ్యాకులకు

ప్రాధాన్యం కల్పించే

సత్ సంకల్పానికి శ్రీకారం చుట్టిన సాహిత్య అకాడెమికి అభినందనలు

కృతజ్ఞతలు అందించవచ్చు.బహు భాషల,

బహు విధముల,బహుభంగుల అన్నట్లుగా దైవభక్తి,దేశభక్తి నుంచి

సాహిత్యానురక్తి వరకూ

అనేక పార్శ్వాల అభివ్యక్తికి చోటుదక్కుతున్న గొప్ప సందర్భం ఈ సంరంభం.

రవీంద్ర కవీంద్రుని స్ఫూర్తిగా రవీంద్ర భవన్ వేదికగా

ఈ వేడుక ముస్తాబైంది.

సినిమా-సాహిత్యం వేరువేరుకాదన్నట్లుగా

సినిమా సారస్వతానికి సముచిత స్థానం కల్పించారు.మాతృభాషల

 అవసరాన్ని,స్థానిక భాషల ఆవశ్యకతను ఈ వేదికల సాక్షిగా చాటిచెబుతున్నారు.

ప్రకృతి గురించి,మానవ ప్రకృతి గురించి కూడా చర్చలు చేపట్టారు.

వైద్యం కూడా ఇక్కడ వస్తువైంది.

పుస్తక ప్రచురణలో నేడు ఎదుర్కొంటున్న కష్టాలు,

రానున్న గడ్డురోజులు,

అసలు పుస్తకంతోనే అవసరంలేని కాలం చేసే గాయాలు,

యంత్రాలు చేసే వింతలు చర్చలకు సరుకుగా మారాయి.పూర్వోత్తరికి కూడా 

పెద్దపీట వేస్తున్నారు. అస్మితకు గొంతునిస్తున్నారు. యోగవిద్యకు కూడా 

ఉత్సవంలో చోటునిచ్చారు.ఫాంటసీ,సైన్స్, ఫిక్షన్,మీడియా,విలువలు 

మొదలైన అన్ని అంశాలపైన,

అన్ని రంగాలపైన

విస్తృతంగా మాట్లాడడానికి, చర్చించడానికి ఈ ఉత్సవం రంగం సిద్ధం చేసింది.

పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలతో పాటు మహనీయ రచయితలకు సంబంధించిన

డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా ఏర్పాటుచేయడం మరో విశేషం.

కేంద్ర సాహిత్య అకాడెమి చేపట్టిన 'ఉన్మేష' నవనవోన్మేషమై,

దేశం నలుదిక్కులా నినదించాలని,

భవిష్యత్తులో మారుమూలలా

విస్తరించాలని ఆకాంక్షిద్దాం.

భాషలు,సాహిత్యం,కళలు, సంస్కృతి సదా విలసిల్లాలి.

దేశం విలువ వెలుగులీనుతూ వుండాలి.-మాశర్మ🙏

ఇంత చక్కని విషయమును పంచిన శ్రీ మా. మారుతీశర్మ  గారికి 

అభినందన పూర్వక ధన్యవాదములు.

జైహింద్.

పిల్లలకు పంటికిందకు వేసుకునే స్నాక్స్ Instant 3 Ingredients Party snack...

వైష్ణవజనతో అనే గుజరతీ గేయమును ఆంధ్రికరించిన ప్రతిభాశాలి డా. ఆచార్యఫణీంద్ర. Vaishnav Jenato Song | Telugu Translation

జైశ్రీరామ్.
జైహింద్.

Wednesday, August 2, 2023

వందేమాతరం గీతోపదేశం | Vandemataram | Republicday Special | TeluguOne

జైశ్రీరామ్.
జైశ్రీరామ్🙏
వందేమాతరం....పూర్తి గేయము.
👇🏻
వందేమాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం

బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

వందే మాతరమ్.🙏

పుట్టినరోజు కి ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు నాలా ట్రెండీగానా అమ్మమ్మలా ఓల్డ...