Wednesday, December 20, 2023

తెలుగు సంవత్సరాల పేరుల క్రమసంఖ్య వాడుతూ పండితుల సంభాషణ చమత్కారంగా ఉంటుంది.

జైశ్రీరామ్.

  తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ….. అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.

‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’ అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ (అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన (అంటే కొడుకు).

‘నీ కొడుక్కేంట్రా ఇరవై తొమ్మిది. గొప్పింటి సంబంధాలు వస్తాయి’ అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’ 

‘వాడికోసారి నలభై జరిగినా తెలిసి రాలేదు’ అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘పరాభవ’

‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ముప్పయి, ముప్పై మూడు కదా! ‘ అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’

‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’ 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’

‘వాడితో వాదనెందుకురా వాడో యాభై అయిదు . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’

 ‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ నలభై ఒకటి లే' అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’

‘వాడసలే ముప్పై ఎనిమిది జాగ్రత్తగా మాట్లాడు. అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు  ‘క్రోధి’ 

జైహింద్.

శ్రీ సరస్వతి ఆలయం | అనంత సాగర్ | సిద్ధి పేట జిల్లా | తీర్థయాత్ర | 16 ఆగష...

జైశ్రీరామ్.
జైహింద్.

యశోధర...YasOdhara - by BEthavOlu Ramabrahmam @ NJ circa 2000.

జైశ్రీరామ్.
జైహింద్.

Thursday, December 7, 2023

తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితో కలిసి చేసిన చివరి వీడియో(Last video with ammamma)

జైశ్రీరామ్.
అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితీ చేసిన చివరి వీడియో. 
తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి ఈ వీడియో చేసి, వీడియో రికార్డింగ్ పూర్తి అవగానే గదిలోనికి వచ్చి మంచముపై పడుకొని త్రేంచుచుండగా (గేస్ త్రేనుపులు ఆమెకు సహజమే) ఏమైందండత్తగారూ అని మాకోడలు అడుగగా ఏమో ఏమౌతోందో తెలియటం లేదు అని అన్నారు. ఆ మాటలు వినిన నేను తటాలున దగ్గరకు వెళ్ళి రా మనం హాస్పటల్కు వెళ్దామన్నాను. పడుకుంటే తగ్గిపోతుంది. నన్ను పడుకోనివ్వండి అన్నారు. అలా కాదు లే అని లేవదీస్తే, నాకు వాంతయేలాగుంది అన్నారు. సరే చేసేసుకో అన్నాను. మంచముపైనే చేసేసారు. మళ్ళీ పడుకుంటానని పడుకున్నారు. అలా కాదు మనం వెంటనే హాస్పటల్కి వెళ్ళాలని లేవదీసాను. మోషనయేలాగుంది అన్నారు. కోడలు తీసుకువెళ్ళింది. మోషనయినతరువాత ఆమెయే కడుక్కొని బైటకు కోడలి సహాయంతో రాగా నేనూ నా కోడలు ఆమెను హాలులో కుర్చీలో కూర్చోపెట్టాము. అంతే ఒళ్ళంతా చల్లబడిపోతోంది. మా పెద్దమ్మాయి బీపీ పరీక్ష చేయగా సున్నా చూపించింది. ఆక్సిజన్ మీటంతో చూడగా అదికూడా సరళరేఖే వస్తోంది కాని అంకెలు రాలేదు. వెంటనే పసుపు మర్దనా చేస్తూ నేను బిగ్గరగా అరిచి నావైపు చూడమన్నాను. ఊఁ అని తలపైకి తేల్చి కన్నులతో ఆకాశంవైపు చూసింది. ఇంతలో మా అబ్బాయి వీల్ చైర్ తేగా దానిలో కూర్చోపెట్టి కారుదాకా తీసుకొనిపోయి, కారు ఎక్కమన్నాను. ఆమె కారు ఎక్కి పడుకున్నారు. ఐదు నిమిషాలలో దగ్గరలో ఉన్న హాస్పటల్కు తీసుకువెళ్ళగా వారు పరీక్షించి ప్రథమ చికిత్స అందిస్తూనే ఇది సివియర్ హార్ట్ ష్ట్రోక్ వెంటనే మరో హాస్పత్రికి తీసుకు పొమ్మన్నారు. క్షణం ఆలస్యం చెయ్యక అంబులెంసులో ఏ.ఐ.జీ. హాస్పటల్కు తీసుకు వెళ్ళగా వారు వెంటనే జాయిన్ చేసుకొని పరీక్షలు చెయ్యడం ష్టంట్ వెయ్యడం మత్తుమందివ్వడం చేసి (సరిగా ఉదయం పది గంటలనుండి) ఐసీయూలో పెట్టారు. 
తే. 20 . 11 . 2023. రాత్రి 9.49.నిమిషములకు మరణించినట్లు తెలియజేసారు. నాబ్రతుకును చూకటిలోనికి నెట్టి తాను కార్తీకసోమవారముపూటా ఆ లలితాపరాభట్టారికలో లీనమైపోయారు.


చం.  చక్కని సూచనాళిని ప్రశాంతిగ చేసితి వింతదాక, నీ
కెక్కడి నుండి చేరె సతి! యీ విధి నిన్ గొనిపోవు మృత్యు వీ
యొక్కక్షణంబు మాత్రమునె? యుల్కును పల్కును లేక మమ్ము నీ
విక్కటులందు ముంచి, పరమేశ్వరిలోనికి చేరిపోతివా?

శివశివా    శివశివా   శివశివా.

Monday, October 23, 2023

శతమానమ్ :శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)... వివరణ

 శతమానమ్ :

శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది.


ఈ “శతమానం” అనే పదబంధానికి మహీధరభాష్యం యీ విధంగా వివరణనిచ్చింది:


“శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’, 

పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“|


అంటే వందలకొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు లేక పూజ్యుడు ఇంద్రుడు అన్నమాట. అంటే సజాతీయులలో ప్రత్యేక పూజ్యత లేక గౌరవనీయత కలిగి ఉండడాన్ని వైదికపరిభాషలో “శతమానం” అంటారన్నమాట!


శతేంద్రియః : ఇంద్రస్య ఆత్మనః లింగం అనుమాపకం అని ఇంద్రియ శబ్ద వ్యుత్పత్తి. ఇంద్రియశబ్దం జీవుడికి చిహ్నం లేక గుర్తు. అయితే ఈ ప్రధానార్థం ఉన్నా యిక్కడ ఇంద్రియానికి అవయవము (organ), శరీరభాగము(part of body), బహిరంతర జ్ఞాన, కర్మ, సూక్ష్మ ఇంద్రియాలు(organs of senses, action & four-fold subtle instruments of innerbeing) అనే అర్థాలు గ్రహించాలి. అంటే బాహ్యాభ్యంతర అనేక


అవయవాలన్నమాట!

ఇప్పుడు ఒక syntactical pattern లో పెట్టి మంత్రభావాన్ని పరికిద్డాం:


శతేంద్రియః శతాయుః పురుషః

శతమానం భవతి| (ఏతత్ తస్య)

ఆయుషి ఏవ ఇంద్రియే ప్రతి తిష్ఠతి,

ప్రతి తిష్ఠతి|


భావం:


అనేక బాహ్యాభ్యంతర అవయవాలుకలిగి, శతసంవత్సర జీవితం కలిగిన పురుషుడు అనేకజనులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా మన్నన పొందుతున్నాడు. అటువంటి యజమాని ఆత్మస్థైర్యాన్నిపొంది ఇహపరాలు రెండూ సాధిస్తున్నాడు. (ప్రతి తిష్ఠతి అని రెండు మారులు అనడానికి ఇది కారణం).


స్వస్తి|


V.V.Krishna Rao

Tuesday, October 17, 2023

ప్రత్యంగిరా దేవి.

ఓం ప్రత్యంగిరాయై నమః. శ్రీ లక్ష్మీ సహస్ర నామములలో 62వ నామము. 

ప్రత్యంగిరా దేవి.

లక్ష సింహ ముఖాలతో...  భగభగమండే కేశాలతో... 

త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. 

శ్రీరాముడు, 

హనుమంతుడు, 

శ్రీకృష్ణుడు, 

ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. 

శత్రుసంహారం, 

దారిద్య్రనివారణ, 

మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. 

శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. 

ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. 

సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. 

రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, 

తెల్లఆవాలు, 

నల్లఉప్పు, 

శొంఠి, 

సమిదల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు.

దుష్టశిక్షణార్థం.

సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. 

ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. 

ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట. 

దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి 

ఆ తల్లిని ప్రార్థించారట. 

అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట.

లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.

అధర్వణవేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అనీ శత్రువులకు వూపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అనీ... 

ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.

ఇంద్రజిత్తు ఆరాధన..

ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. 

శ్రీరాముడు, 

హనుమంతుడు, 

శ్రీకృష్ణుడు, 

ధర్మరాజు, 

నరకాసురుడు, 

ఘంటాకర్ణుడు, 

జరాసంధుడు 

తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. 

రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి. 

రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట. 

అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. 

దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. 

సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. 

ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.

ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. 

ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. 

ప్రత్యక్షంగానే కాదు... పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక. 

నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని..దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం..

ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .

ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. 

అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .

ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . 

ప్రత్యంగిరామాత పుట్టినవైనము..

కృతయుగములో హిరణ్యకశ్యుపుని సంహరించటానికి శ్రీహరి నరసింహా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సంహరించాడు.

రాక్షసాధమున్ని అయినా నరసింహ మూర్తి కోపం చల్లారలేదు.

నరసింహుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసింహుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. 

అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు. 

కానీ నరసింహ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. 

అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు. శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,

మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. 

అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. 

శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.

మహాప్రత్యంగిరరూపవర్ణన:.

నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం.

ఆ స్త్రీ దేహము కారుచీకటితో కూడిన నల్లనివర్ణం..

మగసింహపు వెయ్య తలలతో..

ఒకకవైపు..ఎర్రన్ని నేత్రాలు.. 

మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది.

ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో..

ఒకచేతిలో త్రిశూలము 

మరోచేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్న డమురుకము,

మరో చేతిలో ఈటె వంటి కత్తి..

మరోచేతిలో అసురుని శిరస్సు 

మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో 

మెడలో కపాల మాలతో 

అత్యంత పొడువైన కేశాలతో 

కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు 

నాల్గు సింహల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.

ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములో వుంది.

ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి 

ఈ సరస్సు కు ఎల్లప్పుడు సింహాల గుంపు కాపలాగా వుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు

మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి..

నరసింహ మూర్తి అహంకారాన్ని వీడి..

తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి..

ఉగ్ర నరసింహ అవతారాన్ని చాలించి..

యోగ నరసింహ మూర్తిగా కొలువు తీరుతాడు. 

అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసింహిక అంటూ వర్ణించారు. 

అరటికాయతో కారప్పూస ఎప్పుడైన తిన్నారా లేదా ఐతే ఈ పండక్కి ట్రై చేయండి.(Uni...

Saturday, October 14, 2023

స్వాతిముత్యం,స్వయంకృషి, చాలెంజ్ సినిమాలకు స్పాట్లో డైలాగ్స్ వ్రాసిన శ్రీ తోట సాయినాథ్ మాకోలనీ వాసియే. | Thota...

జైశ్రీరామ్.
ఆర్యా! ఆ అమ్మ అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది కాబట్టే అలా అప్పటికప్పుడు వ్రాయగలుగుతున్నారు. మీకు నా అభినందనలు.
జైహింద్.

Friday, September 22, 2023

కేపీహెచ్పీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో మా మనుమరాలు చిరంజీవి చింతా శ్రీ విజయలహరి కూచిపూడినాట్యం. ఏ. 22 . 9 . 2023

 



కేపీహెచ్పీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో మా మనుమరాలు చిరంజీవి చింతా శ్రీ విజయలహరి కూచిపూడినాట్యం.

Sunday, September 17, 2023

కాశీలో ఉన్న ద్వాదశ ఆదిత్య్తులలో వృద్ధాదిత్యుఁడు.

జైశ్రీరామ్. 

వృద్ధాదిత్యుఁడు

ఉ.  శ్రీగుణ హారితుండనెడి వృద్ధుఁడు కాశిక సూర్యదేవునిన్

వేగమె యౌవనంబు కడుప్రీతినొసంగ తపంబు చేయ, స

ద్యోగివి నిత్యయౌవనముతోవిలసిల్లు మనంగ, నాతఁడున్ 

రాగిలికొల్చె, వృద్దరవినాన్ రవి వెల్గెను నాటునుండియున్.

కాశీలోని 12మంది ఆదిత్యులలో

వృద్ధాదిత్యుడు ఒకరు. 

హారితుడు పేరుగల ఒక వృద్ధుడు

కాశీకి వచ్చి, తపస్సు ఇంకా ఎక్కువగా

చెయ్యాలనీ, దానితో దివ్యమహిమలూ,

శక్తులు సాధించాలనీ, దానికి శారీరకంగా

జవసత్త్వాలు కావాలనే కోరికతో

ఆదిత్యుని సమధికశ్రద్ధాసక్తులతో ఆరాధించాడు.

అతని తపోదీక్షకు మెచ్చి, సూర్యుడు 

ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

వృద్దుఁడైన హారితుడు భాస్కరునికి మ్రొక్కి,

ప్రభూ నాయందు ప్రసన్నుడవైతే తిరిగి

నాకు యౌవనం అనుగ్రహించు. 

ఈ ముసలితనం తపశ్చర్యను

సహించలేకుండా ఉంది. ఇంకా 

తపస్సు చెయ్యాలని నాకోరిక

తపస్సే పురుషార్థ చతుష్టయం-

ధ్రువుడూ మొదలైనవారు

తపస్సుచేసే కదా ఉత్తమపదాలను పొందారు.

అన్నిటిపైనా విరక్తి కలిగించే ఈ వార్థక్యం

ఎంత అసహ్యం కట్టుకున్న భార్యా,

కన్నపిల్లలూ కూడా ముదిసిన ఇంటి 

యజమానుణ్ణి ఏవగించుకుంటారు. 

ముసలితనంతో జీవించడం మంచిదికాదు.

జితేంద్రియులు చిరకాలం తపస్సు చెయ్యాలని 

కోరుకుంటారు. చిరకాలం తపస్సు చెయ్యాలంటే 

శరీరపటుత్వం ఆవశ్యకంకదా? కాబట్టి ఈ వృద్ధప్యం 

పోగొట్టి, సర్వసమర్థమైన యౌవనం ప్రసాదించు - అని కోరగా,

భాస్కరుడు అతని మనసెరిగి వెంటనే యౌవనం 

కలిగేట్టు వరమిచ్చాడు. తరువాత హరీశుడు 

భాస్కరుణ్ణి ఇష్టదైవంగా భావించి

చిరకాలం తపశ్చర్యతో గడిపి కృతార్థుడైనాడు.

వారణాసిలోని వృద్ధహారీశునిచే ఆరాధించబడిన

ఆదిత్యుడు, వృద్ధాదిత్యుడనే పేరుతో ప్రసిద్ధి 

పొందాడు వృద్ధాదిత్యుని సేవించిన వారు

నిత్యమూ యౌవనశక్తితో శుభఫలాలు పొందుతారు.

జైహింద్.

పలకరించండెవ్వరినైనా జైశ్రీరామ్ అని.

 

జైశ్రీరామ్.
జైశ్రీరామ్
జైహింద్.

భారతీయత.

 


సంస్కృతభాష ప్రత్యేకత.

 


Friday, September 15, 2023

కార్తవీర్యార్జునుడు (సేకరణ.. విక్కీపీడియా నుండి)

జైశ్రీరామ్. 

కార్తవీర్యార్జునుడు  హైహయ వంశజుడైన కృతవీర్యుని పుత్రుడు. 

ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, 

దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. 

దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల 

వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.

ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. 

గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో 

మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని 

సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని 

శపించిరి.

     ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. 

ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం 

పెట్టెను. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి 

కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన 

గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని 

ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు 

బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి 

విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి 

అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయమును\

తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మన్ర్ను. 

ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.


ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు 

జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక 

తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు 

మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి 

మెండానికి అతికించి బ్రతికిస్తాడు.


ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 

21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 

5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు 

తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది 

రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు 

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.


కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను.

Wednesday, September 6, 2023

Thursday, August 24, 2023

శ్రావణమాసం వాయనంలోకి పసుపు కుంకుమ సులువుగా అందంగా పేక్ చేసుకోవచ్చు(DIY H...

* అన్న నివేదనల పేర్లు*

 * అన్న నివేదనల పేర్లు*

1)కుశలాన్నం =పులగం
2)చిత్రాన్నం=పులిహోర
3)క్షీరాన్నం=పరమాన్నం
4)పాయసం=పాయసం 
5)శర్కరాన్నం= చక్కెరపొంగలి
6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి
7)దధ్యోదనం= పెరుగు అన్నము
8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9)శాకమిశ్రితాన్నం=కిచిడీ
10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)
12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి
14)మధురపానీయ=పానకం
15)పృథక్=అటుకులు
16)పృథకాపాయస=అటుకుల పాయసం
17)లాజ=పేలాలు
18)భక్ష్యం= పిండివంటలు
19)భోజ్యం= అన్నము మొదలగునవి
20)వ్యంజనం=పచ్చడి
21)అపూపం=అరిసెలు లేదా అప్పములు
22)మాషచక్రం= గారెలు
23)లడ్డుక,= లాడూలు
24)మోదకం= ఉండ్రాళ్ళు

సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక.

సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక. కొన్ని చోట్ల నక్షత్రపు గుఱుతులిడి సంస్కృతపదములిందుఁ బొందుగఁ బొందింపఁబడె. ఈ పదజాతమాంధ్ర పదపారిజాతమన జాతముగఁ గననగును. ( ఓగిరాల రంగనాథకవి, కాకినాడ దగ్గరలోని నీలపురి వాస్తవ్యుడు)

బహుమానము =  మన్నన, మన్నిక, మన్నింపు,
తిరస్కారము = ఆలసు, ఎల్లిదము, చౌక,
క్షాంతి = ఓరుపు, సైరణ, సైవుడు, తాలిమి, శాల్మి, తాళిక,
ఈర్ష్య = ఓర్వమి, ఈర సము, ఈస, ఈసు, గూళు,
వైరము = వేరము, పగటు, ఒంటమి, పగ, ఓమ్మమి, కంటు,
ప్రతి వైరి= సూడు (పగవాడు)
• తీక్షకోపము - రవరవ 
• ప్రణయకోపము = పొలయలుక
మాత్సర్యము - కరకరి, చలము, మచ్చరము, 
• శోకము - ఆలము, ఆకురు, కస్తి
కోపము - కనలు, బైడాలము, కనుపు, కినుక, కినుకము, ఆలుక, చిందు,కాంతాళము, రో సము, చిందర, కనరు, కసరు,
కోపమౌనము=మోడి 
• సుస్వభావము = ఈలువు 
• భక్తి = బత్తి
ఉన్మాదము = వేళాకోళము, త్రిక్క రిమ్మ, రిబ్బ, వెఱ్ఱి, పిచ్చి, ఉమ్మాదము,
ప్రేమ =నెయ్యము, నెయ్యమి, నెమ్మి, నేస్తము, నెనరు, ఎలమి, మేలు, కూరిమి, చెలిమి, అరితి, మచ్చిక, చాళి, ప్రేముడి, మక్కువ,
ఎడతెగని ప్రేమ =మరులు 
• యువయవతులచే భరింపఁబడిన ప్రేమ = వలపు
వాత్సల్యము = ఆర్మిలి, ఆయర్లు, 
* విస్మృతి = మఱుపు, మఱుకువ,
కాంక్ష = ఇచ్చ, కాయువు, కోర్కె, ఏఁకట, కోరిక, ఆస,
ఆర్థాశ = ఆడియాస 
• స్మృతి = తలంపు 
• స్మృతివి శేషము=పోవె
మనోవ్యధ = ఆంగలార్పు, అంగద, నెంజిలి, మనికితము, తుందుడుకు,
ఉత్కంఠ = అగ్గలిక 
• ఉత్సాహము= హాళి, జతనము, 
• అధిక క్రీడ = చెరలాట
కపటము = గబ్బ, గౌరు, గబుసు, కైపు, కిటుకు, కౌడు, డబ్బు, కబడు, డంబు,
అపదేశము - నెపము, నెవము, 
• నిష్క పటుఁడు=నిక్కవుఁడు
స్వప్నము = కల 
• విలాసము= లలి (ఇది యవ్యయము) 
• హిక్క = వెక్కు, వెనటు,
ప్రమాదము - ఏమరి పాటు, ఏమరిక, మోసము, పరాకు,
అవధానము = ఎచ్చరిక, ఎచ్చరింపు, ఏవ, పదిలము, హవణిక, పోణిమి,
కుతూహలము = వేడ్క, వేడుక,
విలాసము = బిత్తరము, కులుకు వెళము, వేళకు, గునుపు, గోనవు, మురిపెము, మురువు, సొగసు, నిక్కు, మిటారింపు, నీటు, మిటారము, తెక్కు, తెక్కరము, ఎమ్మె, టెక్కు, టీకు, 'హెరంగు, హెరుగు, చి స్నె, పొలుపు, పొలపము, ఒయ్యారము;  ఒయారము, బులుపు, హెూయలు,
పరిహాసము = శ్రేణి, తచ్చన, కేరడము, గేలి, 'మేలము, మందె మేలము, ఆట, త్ర స్తరి, హాళి,
క్రీడ = త్రుళ్లాట, గొండ్లి, 
• సహక్రీడ = సయ్యాటము, సయ్యాట,
సంభ్రమము = ఉత్తలము, తమకము, తహతహ, తమి, తత్తరము, చిడిముడి, తరితీపు, తరము, చిడిముడిపాటు,
రోమాంఛము = పులకలు, పులకరము, గద్గురు, గగురు, గరుదాల్పు,
రోదనము = ఏడుపు, ఏడ్పు, గోడు, 
•జృంభణము = ఆవలింత, ఆవలింత,
నిద్రావి శేషము - నిదుర తూఁగు, తందర, 
• నిశ్చయ స్వప్న ము=నిక్కల
నిద్రాసమయమున నుత్పన్నమగుధ్వని = గురక, గురు పెట్టు,
స్వప్న ప్రలపనము = కలవరింపు కలవరింత, కలవలము, కళవళము, 
అవబోధము = 'మేలుకొనుట, మేల్కొనుట, మేలుకొంట, "మేలు కొంచుట, మెలకువ, (ఉపవడము)
భ్రుకుటి = బొమముడి 
*స్వభావము=సాజము 
• అధికకంపము=వడవడఁకు
కంపము = వలి, వలిపిడి, వడఁకు
*పర్వము - పబ్బము, పండుగ, పండువ,
క్షుద్రదేవతోత్సవవి శేషము = లేవ, తంతు, సాకు, సయంపు, జాతర, కొలుపు,
పొతాళలోకము = పాఁపజగము, నేలయడుగు, 
• దేవతా వేశము= సివము
బిలము = విలము, సురంగము, సురంగ,
కందరము = తూము, తూఁటు, తూ పరము, దొండ, చిల్లి, తొల్లి, కన్నము, కనుము, (గ్రంత)
సంపూర్ణము.

ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో !

 ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో ! సృష్ఠి అంతం చెందినా మత్స్యములు జీవించి ఉంటాయి ! తిరిగి సృష్ఠి ఉద్భావించాలంటే మత్స్యముల మూలంగానే జరుగుతుంది !


వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.

ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓరాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడాని కి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆచేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించుశ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి? " అని రాజుప్రశ్నించాడు.

అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పు డు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడ ు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకునౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్న ాయి.

సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకుతీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడ ు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.

ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--

ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్

ఆ శ్రీమన్నారాయణున ి సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--

చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్ శయ్యాపహా!

మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్న ది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైకదేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు . సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలన ి ‘మత్స్యావతారం’ ప్రబోధించినట్లు గా భావించాలి

త్రివిక్రమావతారం రూపకం ఆడియో. స్వరవీణాపాణి స్వరకల్పన...Trivikrama Avirbhavam audio Launching program photos along with audio

తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. T. V. L. గాయత్రి.

 ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. 

 1.   కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 
9.గణగణ. 10.గునగున 
11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత
22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 
27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర.  37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..
 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 
50.భుగభుగ. 
51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. 

తెలుగు పదములు. 
T. V. L. గాయత్రి.

వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకారం(Last min Saree Draping For varalakshmi ...

Wednesday, August 23, 2023

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

 శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం @ ISKCON 


1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని. 
8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. మరణం: క్రీ పూ 18.02.3102
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11  కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : ఛణురా - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం. 
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తం లో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 
27  14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. అతని జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఏపుడు వర్థమానములోనే బ్రతికారు. 
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

ఇవి మనకి తెలుసా?

  ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *నవ గ్రహలకి సంబంధించిన సమిధలు:
 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 
 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు

 మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*

*కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్*
*లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్*
*తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్*
*పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)*
💕 *మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్*
💕 *నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్*
💕 *జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్*
💕 *శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,*
💕 *దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా*
💕 *పరశురామక్షేత్రం* *(పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -* *కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం*
💕 *మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా*
💕 *నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్*
💕 *నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు*
*బోధించిన ప్రాంతం) -* *సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్*
💕 *రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్*
💕 *సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర*
💕 *హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర*
💕 *కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్*
💕 *మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్*
💕 *ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్*
💕 *గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా*
💕 *కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)*
💕 *పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్*
💕 *కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్*
💕 *శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.*
💕 *హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర*
💕 *కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర*
💕 *చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్*
💕 *కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్*
💕 *ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర*
💕 *కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్*
💕 *పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) -* *ఎటాహ్,సహజహంపూర్*
*,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -*
*కంపిల్, ఉత్తర్*
💕 *జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ* *ఆఖరా / రణ్ భూమి,బీహార్*
💕 *కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన*
*ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా*
💕 *మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్*
💕 *విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్*
💕 *శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం*
💕 *ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం*
💕 *నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –*ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్*
💕 *జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్*
💕 *బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్*
💕 *బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.*

Tuesday, August 22, 2023

శ్రావణమాస వరమహాలక్ష్మి అమ్మవారిని గ్రాండ్ గా అలంకరించుకుందాం Varalakshm...