Friday, September 22, 2023
ఇప్పుడే కేపీహెచ్పీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో మా మనుమరాలు చిరంజీవి చింతా శ్రీ విజయలహరి కూచిపూడినాట్యం.
Thursday, September 21, 2023
Monday, September 18, 2023
Sunday, September 17, 2023
కాశీలో ఉన్న ద్వాదశ ఆదిత్య్తులలో వృద్ధాదిత్యుఁడు.
జైశ్రీరామ్.
వృద్ధాదిత్యుఁడు
ఉ. శ్రీగుణ హారితుండనెడి వృద్ధుఁడు కాశిక సూర్యదేవునిన్
వేగమె యౌవనంబు కడుప్రీతినొసంగ తపంబు చేయ, స
ద్యోగివి నిత్యయౌవనముతోవిలసిల్లు మనంగ, నాతఁడున్
రాగిలికొల్చె, వృద్దరవినాన్ రవి వెల్గెను నాటునుండియున్.
కాశీలోని 12మంది ఆదిత్యులలో
వృద్ధాదిత్యుడు ఒకరు.
హారితుడు పేరుగల ఒక వృద్ధుడు
కాశీకి వచ్చి, తపస్సు ఇంకా ఎక్కువగా
చెయ్యాలనీ, దానితో దివ్యమహిమలూ,
శక్తులు సాధించాలనీ, దానికి శారీరకంగా
జవసత్త్వాలు కావాలనే కోరికతో
ఆదిత్యుని సమధికశ్రద్ధాసక్తులతో ఆరాధించాడు.
అతని తపోదీక్షకు మెచ్చి, సూర్యుడు
ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
వృద్దుఁడైన హారితుడు భాస్కరునికి మ్రొక్కి,
ప్రభూ నాయందు ప్రసన్నుడవైతే తిరిగి
నాకు యౌవనం అనుగ్రహించు.
ఈ ముసలితనం తపశ్చర్యను
సహించలేకుండా ఉంది. ఇంకా
తపస్సు చెయ్యాలని నాకోరిక
తపస్సే పురుషార్థ చతుష్టయం-
ధ్రువుడూ మొదలైనవారు
తపస్సుచేసే కదా ఉత్తమపదాలను పొందారు.
అన్నిటిపైనా విరక్తి కలిగించే ఈ వార్థక్యం
ఎంత అసహ్యం కట్టుకున్న భార్యా,
కన్నపిల్లలూ కూడా ముదిసిన ఇంటి
యజమానుణ్ణి ఏవగించుకుంటారు.
ముసలితనంతో జీవించడం మంచిదికాదు.
జితేంద్రియులు చిరకాలం తపస్సు చెయ్యాలని
కోరుకుంటారు. చిరకాలం తపస్సు చెయ్యాలంటే
శరీరపటుత్వం ఆవశ్యకంకదా? కాబట్టి ఈ వృద్ధప్యం
పోగొట్టి, సర్వసమర్థమైన యౌవనం ప్రసాదించు - అని కోరగా,
భాస్కరుడు అతని మనసెరిగి వెంటనే యౌవనం
కలిగేట్టు వరమిచ్చాడు. తరువాత హరీశుడు
భాస్కరుణ్ణి ఇష్టదైవంగా భావించి
చిరకాలం తపశ్చర్యతో గడిపి కృతార్థుడైనాడు.
వారణాసిలోని వృద్ధహారీశునిచే ఆరాధించబడిన
ఆదిత్యుడు, వృద్ధాదిత్యుడనే పేరుతో ప్రసిద్ధి
పొందాడు వృద్ధాదిత్యుని సేవించిన వారు
నిత్యమూ యౌవనశక్తితో శుభఫలాలు పొందుతారు.
జైహింద్.
Saturday, September 16, 2023
Friday, September 15, 2023
కార్తవీర్యార్జునుడు (సేకరణ.. విక్కీపీడియా నుండి)
జైశ్రీరామ్.
కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుని పుత్రుడు.
ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి,
దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు.
దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల
వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను.
గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో
మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని
సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని
శపించిరి.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు.
ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం
పెట్టెను. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి
కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన
గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని
ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు
బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి
విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి
అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయమును\
తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మన్ర్ను.
ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు
జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక
తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు
మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి
మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై
21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే
5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు
తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది
రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను.
Thursday, September 14, 2023
Wednesday, September 13, 2023
Tuesday, September 12, 2023
Wednesday, September 6, 2023
Tuesday, September 5, 2023
Tuesday, August 29, 2023
Monday, August 28, 2023
Thursday, August 24, 2023
* అన్న నివేదనల పేర్లు*
* అన్న నివేదనల పేర్లు*
సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక.
సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక. కొన్ని చోట్ల నక్షత్రపు గుఱుతులిడి సంస్కృతపదములిందుఁ బొందుగఁ బొందింపఁబడె. ఈ పదజాతమాంధ్ర పదపారిజాతమన జాతముగఁ గననగును. ( ఓగిరాల రంగనాథకవి, కాకినాడ దగ్గరలోని నీలపురి వాస్తవ్యుడు)
ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో !
ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో ! సృష్ఠి అంతం చెందినా మత్స్యములు జీవించి ఉంటాయి ! తిరిగి సృష్ఠి ఉద్భావించాలంటే మత్స్యముల మూలంగానే జరుగుతుంది !
వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓరాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడాని కి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆచేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించుశ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి? " అని రాజుప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పు డు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడ ు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకునౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్న ాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకుతీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడ ు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణున ి సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్ శయ్యాపహా!
మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్న ది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైకదేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు . సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలన ి ‘మత్స్యావతారం’ ప్రబోధించినట్లు గా భావించాలి
తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. T. V. L. గాయత్రి.
ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు.
Wednesday, August 23, 2023
శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం
శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం @ ISKCON
ఇవి మనకి తెలుసా?
ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*
మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు
మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*












































