Monday, February 14, 2011

స్త్రీ, పురుష శిశువులకు నామకరణము చేయునపుడు పాటించ వలసిన అక్షర నియమము.


అమ్మా! నాకు ఏపేరు  పెడతారమ్మా?
శ్లో|| జాతానంతరమేవనామకరణం త్వేకాదశాహేస్ఫుటం |
      పుత్రస్యైవసమాక్షరంతు యువతేః కార్యంతతోవ్యత్యయం !
      సుద్ధిర్జాతకవచ్చనామ్నిసకలై స్తద్ధ్వాదశేషోడశే |
      ద్వావింశేవ్యధవింశకేహ్నివిహితం జాతివ్యవస్థాం వినా || (పూర్వ కాలామృతం) 
తాత్పర్యము:-
ప్రసవమైన వెంటనే జనన నక్షత్ర  పాదమును బట్టి పేరుంచి, పదనోకండవ రోజున శిశువునకు సరియగు నక్షరముల సంఖ్యగల పేరు పెట్టవలయును. ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయును. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు రోజునకాని, యిరువది రెండవ రోజున గాని నామకరణం చేయవలెను. పురుషులకు సరి సంఖ్య, స్త్రీలకు బేసి సంఖ్య గ ల యక్షరములతో నున్న నామమును నామకరణ మహోత్సవములో  నుంచవలెను . 

5 comments:

మన తెలుగు said...

బ్రహ్మాండం గా వుంది. ఎనాళ్ళకో ఈ శ్లోకం మళ్ళా చదువుతున్నాను. మా తాత గారు ఎప్పుడూ చెబుతూండేవారు. ధన్యవాదాలు, రామకృష్ణ గారూ!

రాజేశ్వరి నేదునూరి said...

పాపా ! భలేగా ఉన్నావు.
ముద్దులొలుకు తున్నావు
మత్యాలు రాలుస్తున్నావు .
ముచ్చట గా ఉన్నావు.

prakash jagityal said...

చాలా బాగా వివరించారు.

భాస్కర సాయిప్రసాద్ said...

జాతాశౌచము ఎవరెవరికి వర్తిస్తుంది

భాస్కర సాయిప్రసాద్ said...

జాతాశౌచము ఎవరెవరికి వర్తిస్తుంది