Monday, December 1, 2025
Sunday, November 23, 2025
నా అర్థాంగి మాయని మందహాసముఖి.
జైశ్రీరామ్.
నా అర్థాంగి.
ఉ. మాయని మందహాసముఖి. మాటలు నేర్వని మౌనభాషి. నా
శ్రేయమె కోరునెల్లపుడు చిత్రముగా నిరతంబు కాచు నన్.
ధీయుత, మార్గదర్శి, కులదేవతపోలి రహించునింటిలోన్,
ఈ యమ నాకు భార్యగ మహేశ్వరి పంపుటఁజేసి వచ్చెనే.
10 ఆగ, 2020, సోమ 11:55 PM.
Monday, November 17, 2025
Monday, October 13, 2025
Thursday, September 4, 2025
Wednesday, September 3, 2025
Saturday, August 23, 2025
Friday, August 15, 2025
శ్రీకృష్ణభగవానుని పూజ
శ్రీకృష్ణభగవానుని పూజా ప్రారంభము
పునరాచమ్య (మఱలా ఆచమనము, ప్రాణాయామము చేయవలెను)
ఆచమనీయం
( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః ,ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః ,ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః , ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః
ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }
ధ్యానం:
ఓం కృష్ణం కమల పత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిమ్ ॥
ఓం వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥
ధ్యాయామి బాలకృష్ణం మాత్రకే స్తన్యపాయినం
శ్రీవత్సవక్షసం కాంతం నీలోత్పలదళవచ్ఛతిమ్ ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః
ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం:
ఆవాహయామి దేవేశం శ్రీపతిం శ్రీధరం హరిం
బాలరూపధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహం ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆవాహితోభవ, స్థాపితోభవ,
సుప్రసన్నోభవ, వరదోభవ, స్థిరాసనం కురుకురు, ప్రసీద ప్రసీద
(అక్షతలు దేవునిపై వేయవలెను)
ఆసనం:
దామోదర నమస్తేస్తు దేవకీ గర్భసంభవ
రత్నసింహాసనం చారు గృహ్యతాం గోకులప్రియ ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆసనార్థే రత్నఖచిత
సింహాసనం సమర్పయామి(అక్షతలు, పుష్పములు దేవునిపై వేయవల)
అర్ఘ్యము:
గంధపుష్పాక్షతో పేతం ఫలేనచ సమన్వితం
అర్ఘ్యం గృహాణ భగవాన్ వాసుదేవ ప్రియాత్మజ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి.
అని నీటిని వదలాలి.
పాద్యము:
పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ పూర్వం
పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమో√స్తుతే॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః పాదారవిందయోః
పాద్యం సమర్పయామి.
ఆచమనీయం:
నానానదీ సమాన్వితం సువర్ణకలశస్థితం
గృహాణాచమనార్థాయ విమలం జల మచ్యుత ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆచమనం సమర్పయామి.
మధుపర్కం:
మధు ధధ్వాజ్య సంయుక్తం మహనీయ గుణార్ణవ
మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణ మే ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః మధుపర్కం సమర్పయామి
పంచామృతస్నానం:
పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
పంచామృత స్నాన మిదం గృహాణ కమలాలయే
క్షీరము:
ఆప్యాయస్వమేతుతే విశ్వతః సోమ వృష్ణియమ్।
భవావాజస్య సంగథే॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః క్షీరేణస్నపయామి
దధిః:
దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో రశ్వస్య వాజినః।
సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్ం షితారిషత్॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః దధ్నాస్నపయామి
ఆజ్యం:
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితో త్పునాత్వచ్ఛిద్రేణ।
పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆజ్యేన స్నపయామి
మధుః:
మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః।
మాధ్వీర్నః సంత్వోషధీః మధునక్త ముతోషసి
మధుమత్పార్థివగ్ం రజః మధు ద్యౌరస్తునః పితా॥
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతునః ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః మధునాస్నపయామి
శర్కర:
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సుహవీతు నామ్నే ।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే
మధుమాగ్ం అదాభ్యః ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః శర్కరయాస్నపయామి
ఫలోదకం:
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్ం హ సః॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఫలోదకేనస్నపయామి
పంచామృత స్నానానంతరం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్।
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః యజ్ఞోపవీతం సమర్పయామి
ఆభరణం:
హారనూపుర కేయూర కింకిణీదామ పూర్వకం
గృహాణాభరణం సర్వం శరణాగత వత్సల ॥
శుద్ధోదక స్నానం.
శుద్ధోదక స్నానం.:
గంగా గోదావరీ కృష్ణా యమునాభ్యస్సమానీతం
సలిలం విమలం దేవస్నానార్థం ప్రతిగృహ్యతామ్॥
ఓం ఆపోహిష్ఠా మయోభువః తాన ఊర్ఝే దధాతన
మహేరణాయచక్షసే । యోవశ్శివ తమోరసః ।
తస్యభాజయతే హనః । ఉశతీరవ మాతరః।
తస్మాత్ అరంగమామవః । యస్యక్షయాయ జిన్వధ
ఆపోజనయధాచనః ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానానంతరం శుద్ధ ఆచమనీయం
సమర్పయామి.
వస్త్రం:
పీతాంబర యుగం దేవ గృహాణ సుమనోహరం
దేహిమే సకలానర్థాన్ దేవకి ప్రియనందన॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః వస్త్రయుగ్మం సమర్పయామి
ఉపవీతం:
ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే
పవిత్రం పాహిమాం దేవ నమః పరమపూరుష॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆభరణాని సమర్పయామి
గంధం:
గంధం కుంకుమ కస్తూరీ ఘనసార సమన్వితం
గృహాణ తే నమోదేవ కుబ్జానుగ్రహ కారిణే॥
గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ |
ఈశ్వరీగ్ం' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ‖
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం ।
గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతా ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః దివ్యశ్రీగంధం సమర్పయామి
అక్షతాన్:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్
వాసుదేవ గృహాణత్వం నమస్తే భక్తవత్సల॥
అక్షతాన్ శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద హ్యక్షతాన్ స్వీకురు ప్రభూ ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః అక్షతాన్ సమర్పయామి
పుష్పాణి:
కరవీరైర్జాతి కుసుమై శ్చంపకై ర్వకుళై శ్శుభైః
శతపత్రైశ్చ కల్హారై రర్చయేత్ పురుషోత్తమం ॥
అథాంగపూజ:
ఓం అనఘాయనమః పాదౌ పూజయామి (పాదములు)
ఓం గోపాలాయనమః గుల్ఫౌ పూజయామి (చీలమండలు)
ఓం జన్మరహితాయనమః జానునీ పూజయామి(మోకాళ్ళు)
ఓం పూతనావైరిణేనమః ఊరూః పూజయామి(తొడలు )
ఓం శకటాసురభంజనాయైనమః కటిం పూజయామి (నడుము )
ఓం నవనీతప్రియాయనమః నాభిం పూజయామి (బొడ్డు )
ఓం ఉత్తాళతాలభేత్రేనమః ఉదరం పూజయామి (పొట్ట)
ఓం వనమాలినేనమః వక్షంపూజయామి (వక్షస్థలం)
ఓం చతుర్భుజాయనమః హస్తాన్ పూజయామి(చేతులు)
ఓం కంసారయేనమః కంఠం పూజయామి (కంఠం)
ఓం మధురానాథాయనమః ముఖంపూజయామి (ముఖం)
ఓం కుచేలసంపదప్రదాయనమః కపోలే పూజయామి (బుగ్గలు)
ఓం కంజలోచనాయనమః నేత్రేపూజయామి (నేత్రములు)
ఓం కరుణానిధయేనమః కర్ణౌపూజయామి (చెవులు)
ఓం లలితాకృతయేనమః లలాటం పూజయామి (నుదురు)
ఓం శుకసంస్తుతాయనమః శిరః పూజయామి (శిరస్సు)
ఓం అనఘాయనమః అలకాన్ పూజయామి,ముంగురులు
ఓం సర్వేశ్వరాయనమః సర్వాణ్యంగాని పూజయామి.
అష్టోత్తర శతనామ పూజ:
ఓం శ్రీ కృష్ణాయ నమః | ఓం కమలానాథాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం సనాతనాయ నమః |
ఓం వసుదేవాత్మజాయ నమః | ఓం పుణ్యాయ నమః |
ఓం లీలామానుషవిగ్రహాయ నమః |ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః |
ఓం యశోదావత్సలాయ నమః | ఓం హరయే నమః || ౧౦ ||
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యాయుధాయ నమః |
ఓం దేవకీనందనాయ నమః | ఓం శ్రీశాయ నమః |
ఓం నందగోపప్రియాత్మజాయ నమః |ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః | ఓం పూతనాజీవితహరాయ నమః |
ఓం శకటాసురభంజనాయ నమః | ఓం నందవ్రజజనానందినే నమః ||
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ఓం నవనీతవిలిప్తాంగాయ నమః |
ఓం నవనీతనటాయ నమః | ఓం అనఘాయ నమః |
ఓం నవనీతనవాహారిణే నమః | ఓం ముచుకుందప్రసాదకాయనమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః | ఓం త్రిభంగినే నమః |
ఓం మధురాకృతయే నమః | ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః |
ఓం గోవిందాయ నమః || ౩౦
ఓం యోగినాంపతయే నమః | ఓం వత్సవాటచరాయ నమః |
ఓం అనంతాయ నమః | ఓం ధేనుకాసురభంజనాయ నమః |
ఓం తృణీకృతతృణావర్తాయ నమః |
ఓం యమలార్జునభంజనాయనమః ఓం ఉత్తాలతాలభేత్రే నమః |
ఓం గోపగోపీశ్వరాయ నమః | ఓం యోగినే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః || ౪౦ ||
ఓం ఇలాపతయే నమః | ఓం పరంజ్యోతిషే నమః |
ఓం యాదవేంద్రాయ నమః | ఓం యదూద్వహాయ నమః |
ఓం వనమాలినే నమః | ఓం పీతవాసినే నమః |
ఓం పారిజాతాపహారకాయ నమః | ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః |
ఓం గోపాలాయ నమః | ఓం సర్వపాలకాయ నమః || ౫౦
ఓం అజాయ నమః | ఓం నిరంజనాయ నమః |
ఓం కామజనకాయ నమః | ఓం కంజలోచనాయ నమః |
ఓం మధుఘ్నే నమః | ఓం మధురానాథాయ నమః |
ఓం ద్వారకానాయకాయ నమః | ఓం బలినే నమః |
ఓం బృందావనాంతసంచారిణే నమః |
ఓం తులసీదామభూషణాయ నమః || ౬౦ ||
ఓం స్యమంతకమణిహర్త్రే నమః | ఓం నరనారాయణాత్మకాయనమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః | ఓం మాయినే నమః |
ఓం పరమపూరుషాయ నమః |
ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః |
ఓం సంసారవైరిణే నమః | ఓం కంసారయే నమః |
ఓం మురారయే నమః | ఓం నరకాంతకాయ నమః || ౭౦ ||
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః | ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః |
ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః | ఓం దుర్యోధనకులాంతకాయనమః
ఓం విదురాక్రూరవరదాయ నమః | ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః |
ఓం సత్యవాచే నమః | ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యభామారతాయ నమః | ఓం జయినే నమః || ౮౦ ||
ఓం సుభద్రాపూర్వజాయ నమః | ఓం జిష్ణవే నమః |
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః | ఓం జగద్గురువే నమః |
ఓం జగన్నాథాయ నమః | ఓం వేణునాదవిశారదాయ నమః |
ఓం వృషభాసురవిధ్వంసినే నమః | ఓం బాణాసురకరాంతకాయనమః
ఓం యుధిష్టిరప్రతిష్ఠాత్రే నమః | ఓం బర్హిబర్హావతంసకాయ నమః ||
ఓం పార్థసారథయే నమః | ఓం అవ్యక్తాయ నమః |
ఓం గీతామృతమహోదధ్యే నమః |
ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం దానవేంద్రవినాశకాయ నమః | ఓం నారాయణాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః | ఓం పన్నగాశనవాహనాయ నమః || ౧౦౦ ||
ఓం జలక్రీడాసమాసక్తగోపీజన వస్త్రాపహారకాయ నమః |
ఓం పుణ్యశ్లోకాయ నమః | ఓం తీర్థపాదాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః | ఓం దయానిధయే నమః |
ఓం సర్వతీర్థాత్మకాయ నమః | ఓం సర్వగ్రహరూపిణే నమః |
ఓం పరాత్పరాయ నమః || ౧౦౮ ||
ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం ప్రకృత్యై నమః | ఓం వికృత్యై నమః |
ఓం విద్యాయై నమః | ఓం సర్వభూతహితప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః | ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః | ఓం పరమాత్మికాయై నమః |
ఓం వాచే నమః | ఓం పద్మాలయాయై నమః | ౧౦ ||
ఓం పద్మాయై నమః | ఓం శుచయే నమః |
ఓం స్వాహాయై నమః | ఓం స్వధాయై నమః |
ఓం సుధాయై నమః | ఓం ధన్యాయై నమః |
ఓం హిరణ్మయ్యై నమః | ఓం లక్ష్మ్యై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః | ఓం విభావర్యై నమః | ౨౦ ||
ఓం అదిత్యై నమః | ఓం దిత్యై నమః |
ఓం దీప్తాయై నమః | ఓం వసుధాయై నమః |
ఓం వసుధారిణ్యై నమః | ఓం కమలాయై నమః |
ఓం కాంతాయై నమః | ఓం కామాక్ష్యై నమః |
ఓం క్రోధసంభవాయై నమః | ఓం అనుగ్రహప్రదాయై నమః | ౩౦ ||
ఓం బుద్ధయే నమః | ఓం అనఘాయై నమః |
ఓం హరివల్లభాయై నమః | ఓం అశోకాయై నమః |
ఓం అమృతాయై నమః | ఓం దీప్తాయై నమః |
ఓం లోకశోకవినాశిన్యై నమః | ఓం ధర్మనిలయాయై నమః |
ఓం కరుణాయై నమః | ఓం లోకమాత్రే నమః | ౪౦ ||
ఓం పద్మప్రియాయై నమః | ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః | ఓం పద్మసుందర్యై నమః |
ఓం పద్మోద్భవాయై నమః | ఓం పద్మముఖ్యై నమః |
ఓం పద్మనాభప్రియాయై నమః | ఓం రమాయై నమః |
ఓం పద్మమాలాధరాయై నమః | ఓం దేవ్యై నమః | ౫౦ ||
ఓం పద్మిన్యై నమః | ఓం పద్మగంధిన్యై నమః |
ఓం పుణ్యగంధాయై నమః | ఓం సుప్రసన్నాయై నమః |
ఓం ప్రసాదాభిముఖ్యై నమః | ఓం ప్రభాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః | ఓం చంద్రాయై నమః |
ఓం చంద్రసహోదర్యై నమః | ఓం చతుర్భుజాయై నమః | ౬౦ ||
ఓం చంద్రరూపాయై నమః | ఓం ఇందిరాయై నమః |
ఓం ఇందుశీతలాయై నమః | ఓం ఆహ్లాదజనన్యై నమః |
ఓం పుష్ట్యై నమః | ఓం శివాయై నమః |
ఓం శివకర్యై నమః | ఓం సత్యై నమః |
ఓం విమలాయై నమః | ఓం విశ్వజనన్యై నమః | ౭౦ ||
ఓం తుష్ట్యై నమః | ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః | ఓం శాంతాయై నమః |
ఓం శుక్లమాల్యాంబరాయై నమః | ఓం శ్రియై నమః |
ఓం భాస్కర్యై నమః | ఓం బిల్వనిలయాయై నమః |
ఓం వరారోహాయై నమః | ఓం యశస్విన్యై నమః | ౮౦ ||
ఓం వసుంధరాయై నమః | ఓం ఉదారాంగాయై నమః |
ఓం హరిణ్యై నమః | ఓం హేమమాలిన్యై నమః |
ఓం ధనధాన్యకర్యై నమః | ఓం సిద్ధయే నమః |
ఓం స్త్రైణసౌమ్యాయై నమః | ఓం శుభప్రదాయే నమః |
ఓం నృపవేశ్మగతానందాయైనమః | ఓం వరలక్ష్మ్యై నమః | ౯౦ ||
ఓం వసుప్రదాయై నమః | ఓం శుభాయై నమః |
ఓం హిరణ్యప్రాకారాయై నమః | ఓం సముద్రతనయాయై నమః |
ఓం జయాయై నమః | ఓం మంగళా దేవ్యై నమః |
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః | ఓం విష్ణుపత్న్యై నమః |
ఓం ప్రసన్నాక్ష్యై నమః | ఓం నారాయణసమాశ్రితాయై నమః
౧౦౦ ||
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః | ఓం దేవ్యై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః | ఓం నవదుర్గాయై నమః |
ఓం మహాకాల్యై నమః | ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |ఓం భువనేశ్వర్యై నమః | ౧౦౮ ||
ధూపం:
శ్లో॥ వనస్పత్యుద్భవైః దివ్యైః నానా గంధైస్సు సంయుతమ్ ।
ఆఘ్రేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్॥
శ్లో॥ ధూపం గృహాణ వరద దశాంగేన సువాసితం
గరుడద్వజ గోవింద గోవర్ధన ధరావ్యయ ॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ధూపం సమర్పయామి
దీపం:
శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా।
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ॥
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే।
త్రాహిమాం నరకాద్ ఘోరా ద్దివ్యజ్యోతిర్నమోస్తుతే॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః దీపం దర్శయామి..
నైవేద్యం:
శుద్ధమన్నం పాయసంచ కృపాణాకృపసంయుతం
శీతాన్నం సదఘృతంచైవ గృహాణ గరుడద్వజ ॥
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం పరమేశ్వరి॥
యథాశక్తితో ఎనిమిది పిండివంటలు, పాలు, పెరుగు, వెన్న, మీగడ, పళ్ళు, కొబ్బరికాయలు నివేదింౘవలెను
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః అమృత నైవేద్యం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః హస్తౌ ప్రక్షాళయామి
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః పాదౌ ప్రక్షాళయామి.
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః శుద్దఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః మహా నైవేద్యం నివేదయామి.
తాంబూలం:
పూగీ ఫలైః సకర్పూరం నాగవళ్ళీ దళైర్యుతమ్।
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః తాంబూల , దక్షిణాం సమర్పయామి,
తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
నీరాజనం:
నీరాజనం గృహాణేదం నారాయణ నిరామయ
నీరజాక్ష నమస్తుభ్యం వ్రతాఖిల ఫలప్రద॥
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం
పారమేష్ఠికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం
నతత్రసూర్యోభాతిన చంద్రతారకం
నేమా విద్యతోభాంతి కుతోయమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి॥
ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥
ఓం మంగళం శ్రీమహాలక్ష్మై శారదాయై సుమంగళం
మహిషాసుర మర్థిన్యై మహా గౌర్యైచ మంగళం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః
మంగళ కర్పూర నీరాజనం దర్శయామి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
మంత్రపుష్పం:
పుష్పాంజలిం గృహైణత్వం మయాభక్త్యా సమర్పితం
పురుషోత్తమ పూతాత్మన్ పుణ్యమూర్తే పరాత్పర ॥ల
ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవయం వైశ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యమ్
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయనమః
ఓం తత్ బ్రహ్మ । ఓం తద్వాయుః । ఓం తదాత్మా।
ఓం తథ్సత్యమ్। ఓం తథ్సర్వం । ఓం తత్పురోర్నమః
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వం యింద్రస్త్వం
రుద్రస్త్వ విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వంతదాప ఆపోజ్యోతీ రసోమృతంబ్రహ్మ భూర్భువస్సువరోమ్॥
ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమేస్తు సదాశివోమ్॥
గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీసా చతుష్పదీ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్॥
ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి
పుష్పములు అక్షతలు తీసుకుని స్వామి చెంత యుంౘవలెను.
శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత
జైశ్రీకృష్ణ
శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత
ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభణ కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది. ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు
"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే.
మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.
హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం.
శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది.
దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.
కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
కృష్ణ జన్మాష్టమి పర్వదినం:
కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
జన్మ తిథి:
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది
కృష్ణాష్టమి పండుగ విధానం:
చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు.
శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
యశోదకృష్ణ !భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత
వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.
శ్రీకృష్ణాష్టమీవ్రతకల్పము విశిష్టత
నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే.*
శ్రీకృష్ణ
కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.
కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.
శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.
శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం
ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే [1.3.28 ]
ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే.
కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే.
ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.
కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.
శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు
ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.
రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.
మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.
కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు జతల సప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుదుము.
జైశ్రీరామ్.
జైహింద్.
Saturday, July 5, 2025
రేపు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి ప్రత్యేకత.
జైశ్రీరామ్.
తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత
విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు క్షీరసాగరం లో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం.
పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6, 2025, ఆదివారం వచ్చింది. చాతుర్మాసం ప్రారంభం అయిన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహం, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభ కార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి తెలియక చేసే పనుల వలన పాపానికి గురవుతాడు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.
తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు.
అన్నం, మాంసాహారం తినకండి. తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు. ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
తులసి దళాలను కోయవద్దు ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభకార్యంగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకనే తులసిని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయవద్దు. విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే... వాటిని ఒక రోజు ముందుగానే కోయాలి..
తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది. అశుభ ఫలితాలు వస్తాయి.
గొడవ పడడం, దుర్భాషను ఉపయోగించడం ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాకు వెళ్ళవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్భాషని ఉపయోగించవద్దు. మనస్సు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం. ఈ రోజు శాంతం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి.
పగలు నిద్రపోవద్దు:
ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడటంలో సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుడిని స్మరించుకోండి.
ఇతరులను అవమానించవద్దు, లేదా చెడుగా భావించవద్దు తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు. మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. దానధర్మాలు చేయండి. అందరి పట్ల దయతో ఉండండి.
దానం ఇస్తే నిరాకరించవద్దు :
ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే... దానిని సంతోషంగా స్వీకరించండి. దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది. అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి.
తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే :
తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయనను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించండి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకుని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండండి.
తొలి ఏకాదశి ప్రాముఖ్యత :
తొలి ఏకాదశిని ‘దేవశయన ఏకాదశి’ , ‘పద్మ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, విష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయం ఆధ్యాత్మిక సాధన, నిగ్రహం సమయం. ఈ కాలంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు నిషిద్ధంగా భావిస్తారు.
జైహింద్.
Thursday, July 3, 2025
Wednesday, July 2, 2025
Sunday, June 29, 2025
Saturday, June 28, 2025
ఆంధ్రామృతంలో నా రచనలు లేబిల్ తో ఉన్న గ్రంథములు.
రామ కృష్ణ నీతి శతకము.
శ్రీ అవధానశతపత్ర (ఏకప్రాస శతకము)
శ్రీమద్భగవద్గీత చింతా(తనా)మృతం.
శ్రీయాజ్ఞవల్క్య శతకము.
శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతచ్ఛందశ్శ్రీ రాఘవ శతకము.
వృద్ధ బాల శిక్ష ( నీతి శతకము )
శ్రీ వేణు గోప (కంద గీత గర్భ చంపకోత్పల) శతకము.
చంపకభారతీశతకము.
శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.
శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము.
శ్రీ శివాష్టోత్తరశత పంచచామరావళి. (శివ శతకము)
అష్టోత్తరశత సతీ అశ్వధాటి సతీ శతకము.
సువర్ణమాలాస్తుతి.
శాంభవీ శతకము మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు.
శ్రీరామ పట్టాభిషేకము.
చంపకభారతీశతకము.
పురుషసూక్తము ఆంధ్ర పద్యానువాదము.జనవరి 23, 2025
చంపకభారతీశతకము14, అక్టోబర్ 2024,
శ్రీ లలితా సహస్రనామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.
అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము)22, జులై 2024,
శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము.22, జులై 2024,
శ్రీ శివాష్టోత్తర శతనామ శివశతకము. 22, జులై 2024,
శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.22, జులై 2024,
శ్రీ వసంత తిలక సూర్య శతకము.
వృద్ధ బాల శిక్ష ( నీతి శతకము )19, జూన్ 2024,
సౌందర్యలహరి.. ఆంధ్రానువాదము.
అష్టోత్తరశత రాఘవ నామాంచితాష్టోత్తరశత ఛందముల రాఘవా శతకము3, మే 2024,
క్షీరాబ్దిపుత్రీ! రమా! శతకము.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము. 17, మార్చి 2019,
Thursday, June 26, 2025
భీమవరంలో సామాన్యజనానికి అసామాన్య బోధ గొలుపుచున్న అల్లూరి వంశస్థ బ్రహ్మమమ్మ.......నవరత్నమాలిక..... రచన... చింతా రామకృష్ణారావు.
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
నవరత్నమాలిక.
ఐం. క్లీం. సౌ. నుత బీజవర్ణ కలితాం ఐశ్వర్య సంధాయినీమ్,
ఐం. క్లీం. సౌ. జగదేక రక్షణచణాం ఆరోగ్య సంవర్ధినీమ్,
ఐం. క్లీం. సౌ. వరపాదపద్మయుగళాం ఆర్యాం మహాదేవతామ్,
ఐం. క్లీం. సౌ. నిజభక్త పాలనపరాం, ఆత్మస్థితాం భావయే. 1
అమ్మా! బ్రహ్మమమ్మా! మాయాతీత ప్రశాంత రూపమా!
అల్లూరి వంశ రత్నదీపమా! నమో నమః.
శా. శ్రీమన్మంగళ మానవుండుగ నిలన్ శ్రీకార రూపంబునన్
బ్రేమన్ దల్లి కనంగఁ బుట్టి, గతమే జిత్రంబుగా మాయచే
నేమాత్రంబును గుర్తు లేక, మదిలో నెన్నెన్నియో యోచనల్
భూమిన్ బుట్టిన హేతువున్ గనుటకై పుట్టున్, విచిత్రంబిదే. 2
భావము
ప్రాణి శుభప్రదమయిన మానవునిగా శ్రీకారరూపములో తల్లి ప్రేమతో ప్రసవించగా
పుట్టి, భూమిపై తనను క్రమ్ముకొనిన మాయ కారణముగా తన గతము ఏమాత్రము
గుర్తు లేక పోవుటచే, భూమిపై తన జన్మకు కారణము తెలుసుకొనుప్రయత్నములో
ఎన్నెన్నో ఆలోచనలుచేయును. ఇదే విచిత్రము.
ఉ. బంధు జనంబుతో పెరుగు బంధములన్ విడిపోవ నేరమిన్
సంధి వశంబునన్ మనసు సత్యము గానగలేక, మాయలో
బంధనమొంది, బంధములు వాయక హెచ్చగుచుండ, దుఃఖముల్
పొందుచు తల్లడిల్లి, గురు పూజ్యపదంబుల నెన్ని జేరునే. 3
భావము.
పుట్టుకతో సంభవించిన బంధువులతో పెరుగుచున్న బంధనములను వీడిపోవుట
తెలియఁజాలక, ఈ పూర్వాపరముల సంధి కారణముగా సత్యమును కనఁజాలక
మాయకారణముగా ఐహిక బంధమునమునకు లోనగుచు దుఃఖించుచు
పరిష్కారమునకై పూజ్యమయిన గురుపాదాశ్రయము పొంద యత్నించును.
ఉ. బ్రహ్మమె యమ్మ రూపమయి భక్తిగ వచ్చిన వారిఁ గాతువే,
బ్రహ్మవివేక సంపదను భక్తులకందఁగఁ జేయుచుందువే,
బ్రహ్మ నిజస్వరూపముగ భక్తులకున్ గనిపించు మాత వా
బ్రహ్మమె నీవు, భీమవర పట్టణమందలి కల్పవృక్షమా! 4
భావము.
భీమవర పట్టణములో వెలసిన ఓ కల్పవృక్షమా! బ్రహ్మం అమ్మా!. సాక్షాత్
బ్రహ్మమే అమ్మ స్వరూపమని భావించుచు భక్తితో నీ వద్దకు వచ్చు
భక్తులను కాపాడుదువుకదా తల్లీ! భహ్మజ్ఞానము అనెడి సంపదను భక్తులకు
అందించు దయామూర్తివి. అమ్మగా ఉండియున్న నీవు బ్రహ్మం గా
సాక్షాత్కరించు తల్లివైన నీవు బ్రహ్మకదా.
ఉ. బాధలఁబాపు బ్రహ్మవిల, వచ్చెడి పీడిత మానవాళికిన్
సాధన చేయు మార్గమును చక్కగ చెప్పెడి అల్లురి ప్రభా!
మోదముతోడ మాయతెర పూర్తగ వీడగఁ జేసి, శాంతితో
నీదుచు జీవితమ్ము నడిపించగ జేతువు నీదు వాక్కులన్. 5
భావము.
అల్లూరి వంశమునందలి తేజస్స్వరూపమా! ఐహికమైన ఈతిబాధలను పోఁగొట్టు
బ్రహ్మమే అని నిన్ను భావించుచు నీ దగ్గరకు వచ్చెడి మానవులకుచక్కని
కమ్మని మాటలతోనే మాయను వీడు సాధన మార్గమును చూపించుదువు.
మాయ అనెడి తెరను పూర్తిగా పోవునట్లుగా చేసి, జీవితమును శాంతముగా
సాగునట్లుగ చేయుదువు.
ఉ. నీటనె యుండు తామరకు నీర మొకింతయు నంటనట్లుగా
సాటియెలేని నీకిల నసత్యపు బంధములంటఁ బోవుగా,
చేటును గొల్పు బంధములు శీఘ్రమె పాయువిధంబు దెల్పుచున్
నోటను బల్కు మాటలనె నొవ్వును బాపుదు వమ్మ మాకిలన్. 6
భావము.
నీటిలో ఉండే తామరాకునకు నీరు అంటని విధముగా సాటిలేని అమ్మకు
అస్త్యమైన ఐహికబంధములేవియు అంటఁబోవు.ఈ తల్లి చెడునే కలిగించెడి
ఈ ఐహిక లంపటములను వెన్వెంటనే వీడఁ జేసుకొను పద్ధతిని కేవలము
మాటలతోనే తెలుపుచు, బాధితుల బాధలన్నిటిని భక్తులకు పోగొట్టు బ్రహ్మము.
ఉ. ఐహికమందె బ్రహ్మమును హాయిగ చేర్చెడి మార్గ మీవెయై,
మోహము పాపి భక్తులకు పూర్తిగ ముక్తికిని గొల్పు శక్తివై,
స్నేహముతోడ శాంతముగ నిత్యము గాచెడి బ్రహ్మమమ్మవై,
మోహవిదూరవైన గురుమూర్తి! స భక్తి నమస్కరించెదన్. 7
భావము.
ఈ శరీరముతో ఈలోకములో ఉండగనే బ్రహ్మస్వరూపమును చేర్చెడి
మార్గమే నీవయి, మోహమునకు దూరమగునట్లుగా ఆశ్రయించినవారిని చేసి,
ముక్తిని పూర్తిగా కలిగించు గొప్ప శక్తివి అయియుండి, భక్తులను నిత్యము
స్నేహభావముతో శాంతముతో చూచుచు కాపాడెడి, మోహమంటని ఓ
గురుమూర్తివయిన బ్రహ్మమమ్మా! నీకు భక్తితో నమస్కరించెదను
స్వీకరింపుము.
ఉ. మా గురుపూజ గైకొనుము, మాయని బ్రహ్మ నిజస్వరూపమా!
యోగమె మాకు నీదు పదయుగ్మము గొల్చుట ధాత్రి నిత్తరిన్,
రాగల ముక్తి చూపితివి, రమ్య మనోహర వాఙ్నిధానమా!
హే గురు రూపిణీ! జయమహీన శుభప్రద! బ్రహ్మమమ్మరో! 8
భావము.
రమ్యమయినట్టియు మనోహరమయినట్టియు వాక్కులకు నిధివయిన
ఓ బ్రహ్మమ్మా! మేము చేయుచున్న గురుపూజను స్వీకరింపుము. ఈ భూమిపై
ఇట్టి విధముగా నీ రెండు పాదములకు ఈ విధముగ సేవించుట అన్నది మాకు
లభించిన యోగమే సుమా. మేము పొందబోయే ముక్తినే మా కనులకు చూపించిన
తల్లివమ్మా నీవు. ఓ గురుస్వరూపిణీ! అంతులేని శుభములు కలిగించు తల్లీ!
నీకు జయమగుగాక.
ఉ. మంగళమమ్మ నీకు, జయమంగళ సద్వర బోధ గొల్పు నీ
మంగళ పాదపద్మ నిగమంబులకిద్ధర మంగళంబగున్,
మంగళమౌత నీ చరణ మార్గము పట్టిన భక్తపాళికిన్,
మంగళమమ్మ సర్వశుభమంగళ భారత దేశ మాతకున్. 9
భావము.
అమ్మా నీకు మంగళమగుగాక. జయప్రదమై మంగళమును కూర్చుమంచి
శ్రేష్టమైన జ్ఞానమును కలుగజేయు నీ పాదములనెడి వేదములకు ఈ భూమిపై
మంగళమగుగాక. నీ పాదములనాశ్రయించిన భక్తకోటికి మంగళమగుగాక.
సమస్త శుభమంగళ స్వరూపిణియైన భారతమాతకు మంగళమగుగాక.
జైహింద్.
Friday, June 20, 2025
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత ..... శ్రీపద్మమహాపురాణంలో....
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత శ్రీపద్మమహాపురాణంలో ఇలా వివరింౘబడింది.
# పూతాం పుణ్యతమాం స్వీయాం, భార్యాం త్యక్త్వా ప్రయాతి యః|
తస్య పుణ్యఫలం సర్వం, వృధా భవతి నాన్యధా॥అ.59,శ్లో.8
# ధర్మాచారపరాం పుణ్యాం, సాధువ్రత పరాయణామ్|
పతివ్రతరతాం భార్యాం, సుగుణాం పుణ్యవత్సలామ్॥అ.59,శ్లో.9
# తామే వాపి పరిత్యజ్య, ధర్మకార్యం ప్రయాతి యః|
వృధా తస్య కృత స్సర్వో, ధర్మో భవతి నాన్యధా॥అ.59,శ్లో.10
# సర్వాచారపరా భవ్యా, ధర్మసాధనతత్పరా|
పతివ్రతరతా నిత్యం, సర్వదా జ్ఞానవత్సలా॥అ.59,శ్లో.11
# ఏవం గుణా భవే ద్భార్యా, యస్య పుణ్యా మహాసతీ|
తస్య గేహే సదా దేవా, స్తిష్ఠన్తి చ మహౌజసః॥అ.59,శ్లో.12
# పితరో గేహమధ్యస్థాః, శ్రేయో వాఞ్ఛన్తి తస్య చ|
గంగాద్యాః పుణ్యనద్యా శ్చ, సాగరా స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.13
# పుణ్యా సతీ యస్య గేహే, వర్తతే సత్యతత్పరా|
తత్ర యజ్ఞా శ్చ గావ శ్చ, ఋషయ స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.14
# తత్ర సర్వాణి తీర్థాని, పుణ్యాని వివిధాని చ|
భార్యాయోగేన తిష్ఠన్తి, సర్వాణ్యేతాని నాన్యధా॥అ.59,శ్లో.15
# పుణ్యభార్యా ప్రయోగేన, గార్హస్థ్యం సంప్రజాయతే|
గార్హస్థ్యా త్పరమో ధర్మో, ద్వితీయో నాస్తి భూతలే॥అ.59,శ్లో.16
# గృహస్థస్య గృహం పుణ్యం, సత్యపుణ్య సమన్వితమ్|
సర్వతీర్థమయం వైశ్య, సర్వదేవ సమన్వితమ్॥అ.59,శ్లో.17
# గార్హస్థ్యం చ సమాశ్రిత్య, సర్వే జీవన్తి జన్తవః|
తాదృశం నైవ పశ్యామి, అన్య మాశ్రమ ముత్తమమ్॥అ.59,శ్లో.18
---పవిత్రురాలు, పుణ్యతమురాలు అయిన తన భార్యను విడిచి వెళ్ళినవాడు ఆచరించిన పుణ్యఫల మంతయూ వ్యర్థమగును. ధర్మాచారపరురాలు, పుణ్యురాలు, సాధువ్రతపరాయణురాలు, పాతివ్రత్యరతురాలు, సుగుణవతి, పుణ్యమునందు అనురక్తి గలది అయిన భార్యను విడిచి, ధర్మకార్యమును ఆచరించినౘో, అత డాచరించిన ధర్మమంతయూ వ్యర్థమగును. సర్వాచారపరాయణురాలు, శుభకరురాలు, ధర్మసాధకతత్పరురాలు, సదా పాతివ్రత్య రతురాలు, జ్ఞానవత్సలురాలు, పరమపుణ్యురాలు అయిన భార్యఎవరికి లభింౘునో అతని ఇంటిలో దేవతలు సర్వదా నివసింతురు. అతనింటి మధ్యలో పితృదేవతలుండి, అతని శ్రేయస్సును వాంఛించెదరు. గంగాది పుణ్యనదులు, సాగరములు కూడా అతనింటిలో వసింౘును. సత్యతత్పరురాలైన పుణ్యసతి ఉన్న ఇంటిలో యజ్ఞములు, గోవులు, ఋషులు అౘటనే యుందురు. అౘటనే అన్ని తీర్థములు, పలువిధములైన పుణ్యములు భార్యతోనే ఉండును. పవిత్రురాలైన భార్యాయోగముతో గృహస్థాశ్రమ మేర్పడును. గృహస్థాశ్రమమును మించిన ధర్మము ఈ భూమండలములో మరొకటి లేదు. సత్యపుణ్యములతో కూడియున్న గృహస్థుని ఇల్లు పావనమైనది. ఆ ఇల్లు సర్వతీర్థమయము, సర్వదేవమయము! గృహస్థాశ్రమము నాశ్రయించియే సకల ప్రాణులు జీవింౘుౘుండును. అటువంటి ఉత్తమాశ్రమము వేరొకటి లేదు.
# మంత్రాగ్నిహోత్రం దేవా శ్చ, సర్వేధర్మా స్సనాతనాః|
దానాచారాః ప్రవర్తన్తే, యస్య పుంస శ్చ వై గృహే॥అ.59,శ్లో.19
# ఏవం యో భార్యయాహీన, తస్య గేహం వనాయతే|
యజ్ఞా శ్చైవ నసిద్ధ్యన్తి, దానాని వివిధాని చ॥అ.59,శ్లో.20
# భార్యాహీనస్య పుంసోఽపి, నసిద్ధ్యతి మహావ్రతమ్|
ధర్మకార్యాణి సర్వాణి, పుణ్యాని వివిధాని చ॥అ.59,శ్లో.21
# నాస్తి భార్యా సమం తీర్థం, ధర్మసాధనహేతవే|
శృణుష్వ త్వం గృహస్థస్య, నాన్యో ధర్మో జగత్త్రయే॥అ.59,శ్లో.22
# యత్ర భార్యా గృహం తత్ర, పురుషస్యాపి నాన్యధా|
గ్రామేవా ప్యధవారణ్యే, సర్వధర్మస్యసాధనమ్॥అ.59,శ్లో.23
# నాస్తి భార్యాసమం తీర్థం, నాస్తి భార్యాసమం సుఖమ్|
ఆపస్థంబుడు” అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
”ఆపస్థంబుడు” అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడువంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాం:~
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్తగారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతా సాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్కచెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా "ఇంకా పెట్టు ఇంకా పెట్టు" అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయినా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.*
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసాడు. "ఇంక తృప్తి అయిందా?" అని అన్నాడు. ( భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సంప్రదాయం కదా) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
~కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది.
'ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు' అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణుడిని శపించడానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ‘ఆగు’ అని ఆపేసాడు.
*
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "*నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణులమీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు.
దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత ‘పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది’ అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది
ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు
Friday, May 30, 2025
सम्भाषण-संस्कृतम् ... डाक्टर् राजेन्द्रप्रसादः फोन् पे नेम्बर् 9849641892
జైశ్రీరామ్.
सम्भाषण-संस्कृतम्
(वार्तावाहिनी)
डाक्टर् राजेन्द्रप्रसादः
फोन् पे नेम्बर् 9849641892
1. कः बालकः तत्र अस्ति ।
2. → Which boy is there?
3. ఏ పిల్లవాడు అక్కడ ఉన్నాడు
2. कौ बालकौ तत्र स्तः ।
3. 4. → Which two boys are there?
3. ఏ పిల్లలిద్దరు అక్కడ ఉన్నారు
3. के बालकाः तत्र सन्ति ।
4. → Which boys are there? (plural)
5. ఏ పిల్లలందరు అక్కడ ఉన్నారు (బహువచనమ్)
4. सः कम् बालकम् पश्यति ।
English: He sees which boy?
Telugu: అతడు ఏ బాలుడిని చూస్తున్నాడు?
5. तौ कौ बालकौ पश्यतः ।
English: Those two see which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలురిని చూస్తున్నారు?
6. ते कान् बालकान् पश्यन्ति ।
English: They see which boys?
Telugu: వారు ఏ బాలురిని చూస్తున్నారు?
7. सः केन बालकेन क्रीडति ।
English: With which boy does he play?
Telugu: అతడు ఏ బాలుడితో ఆడుతున్నాడు?
8. तौ काभ्याम् बालकाभ्यां क्रीडतः ।
English: Those two play with which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలులతో ఆడుతున్నారు?
9. ते कैः बालकैः क्रीडन्ति ।
English: They play with which boys?
Telugu: వారు ఏ బాలలతో ఆడుతున్నారు?
10. सः कस्मै बालकाय यच्छति ।
English: To which boy does he give?
Telugu: అతడు ఏ బాలుడికి ఇస్తున్నాడు?
11. तौ काभ्यां बालकाभ्यां यच्छतः ।
English: Those two give to which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలులకు ఇస్తున్నారు?
12. ते केभ्यः बालकेभ्यः यच्छन्ति ।
English: They give to which boys?
Telugu: వారు ఏ బాలలకిస్తారు?
13. सः कस्मात् बालकात् स्वीकरोति ।
English: From which boy does he receive?
Telugu: అతడు ఏ బాలుడి నుండి తీసుకుంటున్నాడు?
14. तौ काभ्यां बालकाभ्यां स्वीकुरुतः ।
English: Those two receive from which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలుల నుండి తీసుకుంటున్నారు?
15. ते केभ्यः बालकेभ्यः स्वीकुर्वन्ति ।
English: They receive from which boys?
Telugu: వారు ఏ బాలల నుండి తీసుకుంటున్నారు?
16. सः कस्य बालकस्य स्नेहितः अस्ति ।
English: He is the friend of which boy?
Telugu: అతడు ఏ బాలుడి స్నేహితుడు?
17. तौ कयोः बालकयोः स्नेहितौ स्तः ।
English: Those two are friends of which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలుల స్నేహితులు?
18. ते केषां बालकानां स्नेहिताः सन्ति ।
English: They are friends of which boys?
Telugu: వారు ఏ బాలల స్నేహితులు?
19. सः कस्मिन् बालके विश्वासं करोति ।
English: In which boy does he trust?
Telugu: అతడు ఏ బాలుడిపై విశ్వాసం పెట్టాడు?
20. तौ कयोः बालकयोः विश्वासं कुरुतः ।
English: Those two trust in which two boys?
Telugu: ఆ ఇద్దరూ ఏ ఇద్దరు బాలులపై విశ్వాసం పెడుతున్నారు?
21. ते केषु बालकेषु विश्वासं कुर्वन्ति ।
English: They trust in which boys?
Telugu: వారు ఏ బాలలపై విశ్వాసం పెడుతున్నారు?
జైహింద్.
Wednesday, May 28, 2025
Tuesday, May 27, 2025
Friday, May 23, 2025
Sunday, May 11, 2025
Saturday, May 10, 2025
Thursday, May 8, 2025
మీ నాలుక రంగుని బట్టి, మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇట్టే పసిగట్టవచ్చు.
మీ నాలుక రంగుని బట్టి, మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇట్టే పసిగట్టవచ్చు. నాలుక శరీరంలోని అతి ముఖ్యమైన అవ యవాల్లో ఒకటి. సాధారణంగా ఆరోగ్యవంతమైన నాలుక గులాబీ రంగులో, బ్యాలెన్స్డ్ తేమతో, సన్నటి తెల్లటి పొరతో ఉంటుంది. మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు లేవని చెప్పడానికి ఈ లక్షణాలు నిదర్శనం. కానీ ఇందుకు భిన్నంగా రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది అనారోగ్య సంకేతం. నాలుక రంగు సాధారణం కంటే భిన్నంగా మారడం, పాలిపోయి ఉండటం మీ శరీరంలో రక్తహీనతను లేదా విటమిన్ బీ12 లోపాన్ని సూచిస్తుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో అనారోగ్యాలకు దారితీస్తుంది.
నాలుక గరుకుగా, చీలికలతో ఉన్నా అనారోగ్య సంకేతమే. డీహైడ్రేషన్, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నల్లగా మారి నాలుకపై చిన్నపాటి ముళ్లమాదిరి లక్షణాలు కనిపిస్తే బ్యాక్టీరియా పేరుకు పోవడమో లేదా యాంటీ బయాటిక్ ఉపయోగం వల్లనో జరిగిందని అర్ధం చేసుకోవచ్చు. నాలుక ఎక్కువ ఎర్రగా కనిపించినా అనుమానించాల్సిందే. ఎందుకంటే కాసాకి వ్యాధి లేదా విటమిన్ల లోపాల వల్ల ఇలా జరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పడిపోతుంది. అంతేకాకుండా నాలుకపై తెల్లటి మచ్చలు మందమైన పొర ఓరల్ థ్రష్ లేదా లైకెన్ ప్లానస్ వంటి ఇన్ఫెక్షన్లకు సంకేతం.
నాలుకపై పుండ్లు - మీ శరీరంలో హార్మోన్లలో మార్పులు, అసమతుల్యత, అధిక మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నాలుకపై ఇలాంటి సంకేతాలు పొడచూపుతాయి. లేదా ఫుడ్ అలెర్జీల వల్ల కూడా తలెత్తే చాన్స్ ఉంటుంది. అయితే నాలుకపై పుండ్లు తరచుగా కనిపిస్తుంటే అది నోటి క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. ఏది ఏమైనా మీ శరీరంలో తలెత్తే సమస్యలకు సంబంధించిన సంకేతాలు చాలా వరకు నాలుకపై ప్రభావం చూపు తుంటాయి. అందుకే నాలుక విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేర్ తీసుకోవాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, హైడ్రేటెడ్గా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం నాలుక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవసరం అయితే మీ వైద్యుడిని సంప్రదించండి.
ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం.
9849162699
అమ్మమ్మతో నేను ... చానల్ లో Simple Sizzlerఇంత చిన్నఏడేళ్ళ పిల్ల శ్రీసంహిత రెస్పాన్సెంతబాగుందో చూడండి. జైహింద్.
Tuesday, May 6, 2025
Sree Bhagavatula Somannaa ZPHighSchool, Golden jubilee celebrations of 1974-75 SSC Batch, Dimili village.
ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.
జై శ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.
పరమాత్మా! బ్రహ్మ ముహూర్తంలో నన్ను అజ్ఞాన యుతమైన నిద్ర నుండి లేపుము. అట్టి పవిత్ర సమయమున అంతరంగంలో నిన్నే స్మరించు నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము.
పరమేశ్వరా! పర్వతాల వలె సుఖదుఃఖాలు భయపెట్టినను, చివరి శ్వాస వరకు త్రికరణశుద్ధిగా నీ ప్రార్ధనలోనే నిలువగల శక్తి సామర్ధ్యాలను నాకు ఒసగుము.
సర్వేశ్వరా! ప్రతినిత్యమూ భక్త సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ఇవ్వు. నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించు.
సర్వజ్ఞా! ఇంద్రియ భోగాలపైన, బలీయమైన వాంఛలపైన, పరిపూర్ణ విరక్తిని నాకు కలిగించు. నీవు నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూ... గమనిస్తూ... కొలువై ఉన్నావనే జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకము అగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.
ఈశ్వరా! తెలిసి గానీ, తెలియక గానీ నా వలన ఏ ప్రాణికి హాని జరుగని విధంగా నడుచుకొనునట్లు నన్ను అనుగ్రహించు. ఆత్మ స్తుతి, పరనిందలు అనెడి పాప కూపంలో పడకుండా నన్ను కాపాడు.
ప్రేమైక మూర్తీ! ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండే లాగున నన్ను అనుగ్రహించు.
హే దీనబంధూ! దేహాభిమానాన్ని, స్వార్ధాన్ని నా నుండి తొలగించు. విషయ సుఖాలు నన్ను బంధించుచున్నవనే జాగృతి నిరంతరం నాలో ఉండేటట్లు కరుణించి నాకు త్రికరణ శుద్ధిని ఇమ్ము.
కరుణాసాగరా! కీర్తి ప్రతిష్టల మీద, ధన ధాన్య సంపాదన మీద, లౌకిక భోగాలపైన నా చిత్తంలో... కాంక్ష కలుగని రీతిగా దయ చూడు.
సర్వాంతర్యామీ! ఈ కనబడే ప్రపంచంలో నామరూపాలు అన్నిటియందు నీవే సత్యంగా... ఒక్కటిగా ఉన్నట్లు నాకు గోచరించే లాగున స్ఫురింప జేయుము.
ఓ సదానందా! సర్వ ప్రాణుల యందు దయ, సాటి మానవుల యందు అకారణమైన సహజ ప్రేమ నాలో పొంగేలా నన్ను అనుగ్రహించు. రాగద్వేష, అసూయలు నాలో పొడసూపనీయకు తండ్రీ...
అచ్యుతా! దూషణ, భూషణ తిరస్కారాల వలన నా మనసు చలించకుండునట్లు నన్ను అనుగ్రహించు. భక్త బృందంతో ఎల్లకాలము కూడి యుండునట్లు చేయుము.
భగవంతుని ఇష్ట దైవ రూపంలో గానీ, గురు రూపంలో గానీ ఆరాధించుచున్న నన్ను ఆయా రూపాలతోనే అనుగ్రహించు. అన్ని రూపాలు నీవే కనుక నాలో అభేద భావం కలుగజేయుము తండ్రీ!
పాహిమాం.... రక్షమాం..... పాహిమాం ప్రభో!
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Friday, May 2, 2025
Saturday, April 26, 2025
జ్ఞాపకాల దొంతర....... ఎవరో వ్యక్తంచేసినది సేకరించి ఇక్కడుంచాను.
జైశ్రీరామ్.
జ్ఞాపకాల దొంతర
రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ.
SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది.
గెజిటెడ్ ఆఫీసర్లు అయినా, కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిళ్లు తొక్కుకుని ఆఫీస్ లకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు.
చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా.
అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.
ఇంటి ముందుకు
కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు. మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు. గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు. మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు. బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ. ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.
వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు. "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, ముందు చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న చూపించిన గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి.
మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు... సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..
రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!
అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం.... ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు కున్నాం!
ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు.
ఇప్పటి కాలం పిల్లలకు
అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు
ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు
వీధిలో పిల్లల అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు
ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయె
ఎక్కడా వెదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు
కూరలమ్మే సంతలు లేవు
పెరుగులమ్మే ముంతలు లేవు
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు
కుప్పిగంతులు లేనే లేవు
కళ్ళ గంతలు కానే రావు
డ్రింకు మూతల గోలే లేదు
బచ్చాలాడే ఇచ్చా లేదు
కోతి కొమ్మచ్చి ఏమైపోయే
అవ్వా అప్పచ్చి ముందే పాయె
గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె
గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు
ధారగా కారే ముక్కులు లేవు
జోరుగా జారే లాగులు లేవు
కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు
బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె
కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె
అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ మాసికలాయె
దానికితోడు కరోనా వచ్చె
బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె
బడిగంటల ఊసే లేదు
బడికి పోయే ధ్యాసే లేదు
మూతులన్నీ మాస్కుల పాలు
చేతులన్నీ సబ్బుల పాలు
ఆన్ లైన్ లో పాఠాలాయె
అర్థం కాని చదువులాయె
ప్రశ్నలకు జవాబులుండవు
కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు
ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే
రేపటి సంగతి దేవుడి కెరుక
నేటి బాలలకు తప్పని చురక
బాలానందం లేని నేటి జీవితం
మానవాళికే మాయని మరక.
అందుకే మన తరం అదృష్టవంతులమ్*!
1950 -70 లో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.
ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న సామాజిక -ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది... అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది. పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే. పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.
దాదాపు అందరం భట్టిపంతుల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు కూడా లేకుండా నడిచిన వాళ్ళమే!
ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. పావలా/అర్ద రూపాయి ఇచ్చి నేల, బెంచి టిక్కెట్ కొనుక్కుని తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట, రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం.
ఈ నాటికీ దాదాపు మనం అందరం
✌🏻55- 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే! అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే.
అందుకే మనకన్నా అదృష్టవంతు లెవరుంటారు?
*అందుకే వీలయినప్పుడల్లా కలుసుకుని ముచ్చటించుకుందాం.
జైహింద్.
Thursday, April 24, 2025
Tuesday, April 22, 2025
"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం" అన్నది విష్ణుమూర్తి మంత్రమా లేక వినాయకుడి గురించిన మంత్రమా?
జైశ్రీరామ్
"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం" అన్నది విష్ణుమూర్తి మంత్రమా లేక వినాయకుడి గురించిన మంత్రమా? దీనిని చిన్న పిల్లలకు ఎందుకు నేర్పిస్తారు?
శుక్లాంబధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥
అన్న శ్లోకం కొన్ని వందల యేళ్లనుండీ భారతీయుల నోళ్లల్లో నానుతూ వస్తోంది. అయినా, ఏ మాత్రమూ తన తీపిని కోలుపోలేదు. దీని అర్థాన్ని నిర్ణయించే ముందు, ఈ శ్లోకం వాఙ్మయంలో ఎక్కడెక్కడ ఉందో పరిశీలిద్దాం.
పద్మపురాణం. వేదవ్యాసుడు రచించినటువంటి పద్మపురాణం లో నాలుగవదైప పాతాళఖండంలో పురాణమాహాత్మ్యకథనం అనే అధ్యాయంలో శివరాఘవసంవాదంలో శివుడు చెప్పినట్లుగా ఈ శ్లోకంఉంది. ఇందులో శివుడు పురాణశ్రవణమెలా చేయాలి అన్న దానిని వివరిస్తూ, పురాణాన్ని వ్యాఖ్యానించే వ్యక్తిని భక్తిగా ఇంటికి రావించాలనీ, అతడిని సత్కరించాలనీ ఇత్యాది విధివిధానాన్ని చెబుతూ, ముందుగా దేవతలను పూజించాలని చెబుతూ ఈ శ్లోకాన్ని చెప్పాడు. అయితే దీని తరువాత వచ్చిన శ్లోకపంక్తి - సభాసదశ్చ సంపూజ్య గణేశం ప్రార్థయేత్తతః అని. అంటే, తరువాత గణేశుడిని ప్రార్థించవలెను అని దానర్థం. తరువాత పార్థించడమేమిటి? పైన శ్లోకంలో ప్రార్థించాము కదా అని ఒక ప్రశ్న. పై శ్లోకాన్ని ఉపయోగించే శివుడు ప్రార్థించమంటున్నాడు అని ఒక అన్వయం చెప్పవచ్చు. కాదు, పై శ్లోకం విష్ణుపరమని ఆయన ఉద్దేశం, కనుక పైదీ క్రిందదీ వేరూ అని కూడా వాదన చేయవచ్చును. శ్లోకమున్నది కానీ అది విష్ణుపరమా, గణపతి పరమా అన్న అర్థం పద్మపురాణం లో లేదు అని ప్రస్తుతానికి రూఢి చేసుకుందాం.
స్కాందము. పురాణాలలో అతిపెద్దదైన స్కందపురాణంలో ఐదవదైన అవంతీఖండంలో విష్ణుభక్తి మాహాత్మ్యాన్ని వివరిస్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి మరొకటి - లాభస్తేషాం జయస్తేషాం అన్నది. ఇది జనార్దనుడి మీద శ్లోకమని అందరికీ తెలిసినదే. తరువాత శ్లోకం - అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజ్యతే యః సురైరపి, సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః అని ఉన్నది. అంటే, దేవతలు సైతం, తమ కోరికలు తీరడానికి ఎవరిని పూజిస్తారో, అటువంటి సర్వవిఘ్నాలనూ హరించేటువంటి గణాధిపతికి నమస్కారము అని. ఇది వినాయకప్రార్థన అనుకుంటే, పైన ప్రారంభశ్లోకం వినాయకుడిదే అని ఎలా అంటారు? కనుక అది విష్ణుసంబంధమైనదే అనవచ్చు. లేదా, ఏం, రెండుసార్లు వినాయకుడి ప్రార్థన రాకూడదని నియమమున్నదా? రావచ్చు అని కూడా చెప్పవచ్చు. అదే స్కాందపురాణంలో మూడవదైన బ్రహ్మఖండం మొదటి అధ్యాయమైన సేతుమాహాత్మ్యవర్ణనము ఈ శ్లోకంతోనే మొదలవుతోంది.
విష్ణుసహస్రనామము. సుప్రసిద్ధమైన విష్ణుసహస్రనామంలో ప్రారంభంలో ఈ శ్లోకం వినవస్తుంది. ఇక్కడ కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థనే అని అంటే, కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థన కాదు, అలా అని విష్ణుమూర్తి ప్రార్థన కూడా కాదూ, వైకుంఠంలో వైష్ణవగణాలకు అధిపతి అయిన విష్వక్సేనుడని ఒకాయనున్నాడూ, ఆయనకూడా ఏనుగుతలను కలిగి, విఘ్నాలను పోగొడతాడూ అంటూ ఇది విష్వకేనస్తుతి అంటూ తృతీయమార్గంలో అన్వయాలు చేసారు. అయితే నేను పరిశీలించిన కొన్ని మహాభారతప్రతులలో, అనుశాసనికపర్వంలో ఎక్కడైతే విష్ణుసహస్రనామం చెప్పబడిందో ఆ చోట ఈ శ్లోకం లేదు. కనుక ఇది వైష్ణవపరమా, వినాయకపరమా అన్నది తెలియదు.
ఇతరగ్రంథాలు. మనకు తెలిసినటువంటి నోములూ, వ్రతాలూ, ఇతర పూజావిధివిధానాల వాఙ్మయం ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. దానితో పాటుగా, ఫలదీపిక వంటి జ్యోతిష్యగ్రంథాలూ, అహిర్బుధ్న్యసంహిత, సాత్త్వతసంహిత ఇత్యాది సంహితాగ్రంథాలూ, వందలాదిగా దేవతా స్తోత్రాలూ ఈ శ్లోకాన్ని తమ మొట్టమొదటి శ్లోకాలలో ఒకటిగా పెట్టుకున్నాయి. అయితే, పెద్దల నోళ్లనుండి వినేటపుడు వినాయకుడి అర్థమే ధ్వనిస్తుంది కానీ, విష్ణుమూర్తి అర్థం ధ్వనించదు వీటిల్లో.
ఇప్పుడు అసలు ఈ శ్లోకానికున్నటువంటి అర్థాన్ని పరిశీలిద్దాం.
శుక్ల = తెల్లనైనటువంటి, అంబర = వస్త్రమును, ధరం = ధరించినవాడినీ; విష్ణుం = విష్ణువునూ; శశి = చంద్రుడితో సమానవైనటువంటి/చంద్రసంబంధమైనటువంటీ, వర్ణం = రంగు కలిగినవాడినీ; చతుర్భుజం = నాలుగు భుజాలతో విరాజిల్లేవాడినీ; ప్రసన్న = నిర్మలమైనటువంటి, వదనం = ముఖము కలిగినవాడినీ; సర్వ= సమస్తములైన, విఘ్న= ఒక పని చేసేటప్పుడు వచ్చే అడ్డంకుల యొక్క, ఉపశాంతయే = ఉపశాంతి (శాంతించుట) కొరకు; ధ్యాయేత్ = ధ్యానము చేయవలెను.
వినాయకుడి పరంగా అన్వయాలు -
ఈ శ్లోకం వినాయకుడిది అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదౌ పూజ్యో గణాధిపః అన్న సూక్తిననుసరించి, ఈ శ్లోకం చాలా రచనలలో మొదటగా చేరి ఉండటం. రెండు, సర్వవిఘ్నోపశాంతయే అన్న వాక్యం. ప్రసిద్ధంగా గణపతి విఘ్నాలకు అధిపతి. విఘ్నాలను తొలగించడం కోసం మన పెద్దవాళ్లు గణపతిని చిలవలు పలవలుగా ప్రార్థించారు. ఈ ప్రార్థన విష్ణువును చేసినట్లుగా ఎక్కడా కనపడదు.
మరి, వినాయకుడికి అన్వయించడానికి ఈ శ్లోకంలో ఉన్న అడ్డాలు ఏమిటంటే -
విష్ణుం అన్న పదం - వినాయకుడిని మనకు తెలిసినదానికి విరుద్ధంగా లకుమికరా (లక్ష్మీప్రదుడా - లక్ష్మీగణపతి మనకు తెలుసును) అనీ, ఆంజనేయావతారం (హనుమంతుడి అవతారమనీ) అన్నట్లు మనకు తెలుసు. కానీ విష్ణువన్న పదం వినాయకుడికి వాడబడటం, అదీ ఇంత సూటిగా అని ఇంకెక్కడా మనము చూడము. అయితే, దీనికి పెద్దలు చెప్పిన వివరణలు - ఒకటి, వినాయకుడూ విష్ణువూ ఒక్కరే అన్న సమన్వయమైన అర్థాన్ని ఈ శ్లోకమిస్తోందని. రెండు, విష్ణువంటే ఇక్కడ విష్ణుమూర్తి అని కాదు, వ్యాపనశీలః విష్ణుః అనే వ్యుత్పత్తిననుసరించి వినాయకుడు సర్వాంతర్యామి అన్న అర్థం ఇందులో ఉందని. ఈ అన్వయం సమంజసమైనదే.
ఈ విష్ణుం అన్న పదం అడ్డం వచ్చిందని భావిస్తూ మరికొంత మంది ఈ శ్లోకానికి శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం అన్న పాఠాంతరాన్ని పెట్టి, ఏ గొడవా లేదని ఊరుకున్నారు.
శశివర్ణము - వినాయకుడు ఏ రంగులో ఉంటాడు అంటే, అథర్వణవేదంలోని గణపత్యుపనిషత్తు ఆయన్ను "రక్తం, లంబోదరం, శూర్పకర్ణకం, రక్తవాససం, రక్తగంధానులిప్తాంగం, రక్తపుష్పైస్సుపూజితం" అని వర్ణించింది. గణపతి ఎర్రగా ఉంటాడట, ఎరుపు బట్టలే వేసుకుంటాడట, ఎరుపుగంధం పూసుకుంటాడట, ఎర్రని పుష్పాలతో పూజించబడతాడట. మరి ఈ శ్లోకంలో ఆయన్ను తెలుపు బట్టలు ధరించినవాడనీ, తెల్లగా ఉంటాడనీ అన్నారే? అంటే, గణపతికి రూపాలనేకం ఉన్నాయి. తొమ్మిది రూపాలను కొంతమంది చెబితే, కొంతమంది ఇరవై రూపాలను చెప్పారు. కొన్నింటిలో గణపతికి మూడవకన్ను ఉంటే, కొన్నింటిలో చంద్రవంక ఉంటుంది. అంచేత గణపతి తెల్లగా ఉండడనీ, తెలుపు బట్టలు కట్టుకోడనీ చెప్పలేము. కనుక ఇది గణపతికి సాధ్యమయ్యేదే. అంతే కాక, మనకు సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు తెలుసు. వాటిలో సత్త్వము జ్ఞానానికి సంకేతం. దానికి వాడే రంగు తెలుపు. అందుచేత, సత్త్వస్వరూపమైనటువంటి వినాయకుడు, జ్ఞానప్రదాత అయి, తెలుపు రంగులో ఉంటాడని విరవణ.
గణపతి అన్వయాన్ని సమర్థిస్తూ, ప్రసన్నవదనం అనే పదానికి ప్రసన్నో మత్తవారణః అని ఒక వ్యుత్పత్తిని నేను పెద్దవారి వద్ద విన్నాను. అంటే ప్రసన్న వదనుడంటే ఏనుగుముఖం కలవాడు అని. అయితే ఈ వ్యుత్పత్తి ప్రసిద్ధ సంస్కృతనిఘంటువులలో నాకు తారసపడలేదు.
గణపతి పరంగా ఈ శ్లోకార్థమిది - తెల్లని బట్టను ధరించినవాడినీ, సర్వవ్యాపకుడినీ, తెల్లని వర్ణంలో ఉండేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ (అయిన వినాయకుడిని) సమస్తమైన విఘ్నాల ఉపశాంతి కోసం ధ్యానము చేయవలెను.
విష్ణుమూర్తి పరంగా అన్వయాలు -
ఈ శ్లోకం విష్ణుమూర్తిదే అని చెప్పడానికి ప్రధానబలం విష్ణుం అన్న పదమే. విష్ణువు త్రిమూర్తులలో ఒకడు కదా, ఆయన్ను విఘ్నోపశాంతికై ప్రార్థన చేయకూడదా అని కొంతమంది చేసే వాదం.
తెలుపు రంగు. బాగానే ఉంది, మరి విష్ణువు నలుపు రంగులో ఉంటాడని కదా ఆయన్ను నీలమేఘశ్యాముడన్నాం. పచ్చనిబట్ట కట్టుకుంటాడని కదా పీతాంబరుడన్నాం. మరి శుక్లాంబరమూ, శశివర్ణమూ ఆయనకెలా అన్వయిస్తారు? అంటే, దానికి వచ్చిన సమాధానం - కృతయుగంలో విష్ణువు తెల్లగానే ఉండేవాడూ అని. దీనికి ఒక ఉదాహరణ - సత్యనారాయణ వ్రతకల్పంలో కథాప్రారంభంలో నారదుడు వైకుంఠానికి వెడతాడు కదా. అక్కడ శేషతల్పంపై పరుండిన విష్ణువుని చూసి ఆయన తెల్లని రంగులో ఉన్నాడని స్తోత్రం చేస్తాడు. అలాగే, పీతాంబరుడని ఆయన్ను అన్నంతమాత్రాన తెలుపుబట్ట కట్టుకోడని ఏముందీ అని ఒకటి.
విష్ణుపరంగా ఈ శ్లోకానికి చేకూరిన బలం అప్పయదీక్షితులు. ఈయన మహాపండితుడు. శివుడంటే పంచప్రాణాలైనా, శివుడికీ కేశవుడికీ భేదం లేదన్న అద్వైతమార్గావలంబి. ఈయన వరదరాజస్తవమని కంచివరదరాజు మీద ఒక స్తోత్రం వ్రాసాడు. అందులో 27వ శ్లోకంలో ఇలా అన్నాడు -
యుక్త్యాగమేన చ భవాన్ శశివర్ణ ఏవ - నిష్కృష్ట సత్త్వ గుణమాత్ర వివర్త మూర్తిః।
ధత్తే కృపాంబుభరతస్త్విషమైంద్రనీలీం - శుభ్రోఽపి సాంబురమితః ఖలు దృశ్యతేఽబ్దః॥
అంటే, విష్ణుమూర్తి తత్త్వపరంగా, యుక్తిగా ఆలోచిస్తే తెలుపువాడేనట. దయ అనే రసాన్ని నిలువెల్లా నింపుకోవడం చేత, నీటిని నింపుకున్న మేఘం యొక్క రంగు - అంటే నీలవర్ణంలోకి మారిపోయాడట.
ఇంకొక విశేషమేమంటే, ఈ వరదరాజస్తవానికి అప్పయ్యదీక్షితులే వ్యాఖ్యనూ వ్రాసారు. అందులో అంటారు కదా - ఆగమేన, ఆప్తవచనేన చ శశివర్ణమ్. ప్రసిద్ధం హి శివరాఘవసంవాదస్థమ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ఇతి వచనమ్ అని. అంటే, విష్ణువు తెల్లని వాడే. దానికి ప్రమాణంగా పైన మనం చూసిన పద్మపురాణంలోని శివరాఘవసంవాదంలో ఉన్న శుక్లాంబరధరమన్న శ్లోకముంది కదా అని. కనుక, అప్పయదీక్షితుల ప్రకారం శుక్లాంబరధరం అన్న శ్లోకం విష్ణుముర్తిదే కానీ, విష్వక్సేనుడిదో వినాయకుడిదో కాదు.
మరి విష్ణువు పరంగా ఈ శ్లోకాన్ని చూస్తే - తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నవాడినీ, తెలుపు రంగులో ప్రకాశించేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ, ప్రసన్నమైన వదనం కలవాడినీ (అయినటువంటి విష్ణుమూర్తిని) సమస్తవిఘ్నోపశాంతికోసం ధ్యానం చేయవలెను. అని అర్థం చెప్పుకోవాలి...(విక్కీపీడియా ఆధారంగా)
జైహింద్.
Wednesday, April 16, 2025
Tuesday, April 15, 2025
Monday, April 14, 2025
Friday, April 11, 2025
Thursday, April 10, 2025
Wednesday, April 9, 2025
Monday, April 7, 2025
Thursday, April 3, 2025
Wednesday, April 2, 2025
Monday, March 24, 2025
మా SRVD ఎలైట్ సమూహ సభ్యులు.
Sunday, March 23, 2025
Friday, March 21, 2025
Thursday, March 20, 2025
Tuesday, March 18, 2025
Sunday, February 23, 2025
Tuesday, February 18, 2025
ఆలయలలో…తీర్థం .... సేవించే విధానం తెలుసుకుందాం.
ఆలయలలో…తీర్థం
ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?
తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!
గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.
శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు... రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును)ఇస్తారు.
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.
ఈ తీర్ధమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ, అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.
తీర్ధమును ఎలా తీసుకోవాలి
అనే ప్రశ్నకు సమాదానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.
తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.
తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.
తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి.
అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.
1). మొదటిసారి తీర్థం శారీరక,
మానసిక శుద్థి జరుగుతుంది.
2). రెండోసారి తీర్థం న్యాయ ధర్మ
ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
3). మూడోది పవిత్రమైనపరమేశ్వరుని
పరమ పదం అనుకుంటూ
తీసుకోవాలి.
**తీర్థాల రకాలు:-*
1). జలతీర్ధం
2). కషాయ తీర్ధం
3). పంచామృత తీర్ధం
4). పానకా తీర్ధం
*1. జల తీర్ధం:-*
ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించబడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.
*2). కషాయ తీర్ధం:-*
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయములో ఇస్తారు.
రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.
*3). పంచామృత అభిషేక తీర్థం:* పంచామృత సేవనం ద్వారా... చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
*4). పానకా తీర్ధం:-*
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.
పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
*ఇతరమైన రకాలు:-*
ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.
వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.
సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం.
మంచి విషయాన్ని పది మందికి పంచుదాం.
మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.


