Sunday, September 8, 2024

సప్త చిరంజీవులు.

జైశ్రీరామ్. 

సప్త చిరంజీవులు.

శ్లో.  అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

వివరణ.

శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు 

వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి 

లోకహితముకై వ్యాసుడు 

శ్రీరామభక్తితో హనుమంతుడు 

రామానుగ్రహమువలన విభీషణుడు 

విచిత్రజన్మము వలన కృపుడు 

ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు 

సప్తచిరంజీవులైరి । 

వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని 

ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై 

శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము.

జైహింద్.


No comments: