Monday, August 5, 2024

మహాభారతములో ఈ తొమ్మిది పాత్రలలో గ్రహింపవలసిన జీవిత సత్యాలు..

జైశ్రీరామ్. 

తొమ్మిది పాత్రలలో మహాభారత సారాంశం.

1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే 

కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు.

వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.

ఉదా. కౌరవులు.

2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన 

ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. 

వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

ఉదా. కర్ణుడు

3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన 

జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. అశ్వత్థామ.


 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం 

లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై 

బ్రతకవలసి వస్తుంది.

ఉదా. భీష్ముడు.

5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  

దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. దుర్యోధనుడు

6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా 

తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే 

వినాశం జరుగుతుంది.

ఉదా. ధృతరాష్ట్రుడు

7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

ఉదా. అర్జునుడు.

8. మోసం, కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

ఉదా. శకుని

9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ 

నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

ఉదా. యుధిష్ఠిరుడు.

జైహింద్.

No comments: