Monday, September 25, 2017

తిరకాసుగారు తికమక పడ్డారు. .. .. .. రచన శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి.

  జైశ్రీరామ్.
డియర్ ఫ్రెండ్స్. 
నా మిత్రుఁడు  శ్రీ పి.వి.బి.శ్రీరామ మూర్తి 
మంచి పేరెన్నిక గన్న కథా రచయిత. 
తాను ఏ కథా వ్యర్థంహా రచించడు. 
అతడు రచించిన ఏ కథ చూచినా సామాజిక ప్రయోజనం తప్పక ఉంటుంది. 
అతఁడు వ్రాసిన చిన్న పాటి రచన చూడండి.
Pvb Srirama Murty
26-9-2017.F/B
తిరకాసుగారు కళ్లంమూసుకుని కుటిలాలోచనలతో...
ఎవరోతట్టినిపించి చూస్తే సివిల్ వస్త్రాల్లో...
బలవంతంగా తీసుకుపోయారు నెట్టుకుంటూ
కళ్లగ్గంతలుతో బరబర.... ఏదోభాషలో ఏమేమో
అంటూ......
కొంత సమయంతర్వాత దబ్బునపడ్డంతో
కళ్లుతెరిచి చూస్తే ...అయోమయం... అయోమయం...
ఓదగ్గర కణకణ నిప్పులు, తేరిపారచూస్తున్న జనం
కళ్లమూసుకునేసరకి లాఠీ దెబ్బలు
అదేంటనడిగితే
భూలోకంలో వెకిలి చూపులతో స్త్రీలను వేధించారట!
యింకోదగ్గర మండుతున్న యినుప స్థంబాలను కౌగిలించుకుని
వదిలతే లాఠీచార్జి
.........?
వీళ్లంతా స్త్రీలను నిర్థాక్షిణ్యంగా రేప్ చేసారట!
......
పళ్లాలతో డబ్బులు,
తినమని బలవంతం చేస్తున్నారు
తినకపోతే పిడి గుద్దులు
ఏమంటే.......?
అక్రమార్జ న పరులట!
..........
యింకోదగ్గర
విరిగిపోయిన మూడు కాళ్లకుర్చీ పై కూర్చోలేక కిందపడిపోతూ
అయినా try చేస్తూనే....
లాఠీ..
సమాధనం 'పదవీవ్యామోహ పిచ్చోడట!
.........
యేదోభాషలో పెద్దపెద్ద గొంతుతో అరుపులు
చాలా మంది వింటూ
వినకపోతే లాఠీచార్జి
అదే మంటే
విషయపరిజ్ఞానంలేని
భాషాపరిజ్ఞానం లేని
రచనల్చేసి ప్రజానీకాన్ని
(సాహిత్య పిపాసుల్ని)
హింసించాట్ట!
...............
దుర్గంధ భూయిష్టమైన ఆహారాన్ని
బలవంతంగా తినిపిస్తూ
ఏమంటే...?
వాళ్లంతా ఆహారకల్తీ శిఖామణులట!
............
షడ్రషోపేత భోజనం,
కర్లాన్ పరుపులు
చలువ గదులు
అయినా నిరాశగా అనుభవించలేని బేల స్థితిలో
వూరుకోకుడా అడిగాడు
వీళ్లంతా లంచగొండులట!!!!
...............
తిరకాసుగారికి చమటలు పట్టేసి చల్లబడి పోయి
యివన్నీ చేసిన నాకేం శిక్షో.
...
దబ్బుపడ్డట్టయి కళ్లు తెరిచి చూస్తే
పెళ్లాం పిల్లలు లబోదిబోమంటున్నారు
విచారిస్తే
చనిపోయినందుక్కాదట!
"చచ్చి
మళ్లీ
బతికి నందుకట!.
(ముఖ్య గమనిక:-ఎవరినీ వుద్దేశ్యించి రాసినదుకాదు.ఎవరు తమనే అన్వయం చేసుకోవద్దు.హాస్య కవితగా భావించి వదిలేయండి.)
స్వస్తి.
చూచారుకదండి.
మిత్రమా! కథా రచనోత్సాహులకు చక్కని శిక్షణ ఇస్తున్నట్టుగాను, దురాలోచనాపరులకంకుశంగాను సాగిన నీ రచన చాలా ఆనందం కలిగించింది. అభినందనలు.
జైహింద్.

No comments: